టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో కాటేజీల నిర్మాణానికి కూడా సాయం అందించాలని కోరారు.
ఈ విషయంపై టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ శ్రీశైలం దేవస్థానం చైర్మన్ కు తెలియజేశారు.
అనంతరం టీటీడీ చైర్మన్ కు శ్రీశైలం దేవస్థానం బోర్డు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

No comments :
Write comments