తెలంగాణ
రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిని హైదరాబాద్ గవర్నర్ బంగ్లాలో బుధవారం మర్యాద పూర్వకంగా టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు కలిసారు.
ఈ సందర్భంగా గౌరవనీయులు గవర్నర్ గారిని స్వామి వారి శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను టిటిడి ఛైర్మన్ అందించారు. టిటిడిలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు భేషుగ్గా ఉన్నాయని గవర్నర్ అభినందించారు.
గౌరవనీయులు గవర్నర్ స్వరాష్ట్రమైన త్రిపురలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడును కోరారు. త్రిపురలో శ్రీవారి ఆలయానికి స్థలం కేటాయిస్తే ఆలయ నిర్మాణాన్ని టిటిడి చేపడుతుందని తెలిపారు.
No comments :
Write comments