టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం అందింది. దాత శ్రీ వి. వెంకట నాగరాజ శర్మ సదరు డిడిని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు మంగళవారం అందించారు. దాత శ్రీ వి. వెంకట నాగరాజ శర్మ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేదపారాయణదారుగా పనిచేస్తున్నారు.

No comments :
Write comments