19.1.26

జనవరి 25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి-ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న‌ శ్రీ మలయప్ప radha saptami




సూర్య జయంతి సందర్భంగా జనవరి 25 తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.


పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌నిప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోందిరథ‌సప్తమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని భారీ సంఖ్యలో తిరుమ‌ల‌కు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోందిర‌థ‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.


వాహనసేవల వివరాలు :


•  తెల్లవారుజామున‌ 5.30 నుంచి గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం.


•  ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.


•  ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.


•  మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.


•  మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.


•  సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.


•  సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.


•  రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.


ఆర్జిత సేవలు రద్దు :


 పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవంఊంజల్ సేవఆర్జిత బ్రహ్మోత్సవంసహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసిందికాగాసుప్రబాతంతోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.

No comments :
Write comments