13.1.26

శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు adhyayanotsavams





తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గ‌త డాది డిసెంబరు 19 తేదీ నుండి రిగిన అధ్యయనోత్సవాలు సోమవారం ముగిశాయి సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవిభూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్ఠి నిర్వహించారు.


గత 25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా ప్ర‌తి రోజు స్వామివారికి నివేదించారుఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని వేల పాశురాలను పారాయణం చేశారు.


సోమవారంనాడు అధ్యయనోత్సవాల్లో చివరిరోజు కావడంతో ''తన్నీరముదు'' ఉత్సవం నిర్వహించారుఅధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటిరోజు అనగా జ‌న‌వ‌రి 13 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు దక్షిణ మాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి ఆలయానికి వేంచేస్తారు.


ఘనంగా ''తిరుమలనంబి తన్నీరముదు'ఉత్సవం


శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడుశ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాదీ నిర్వహించే ''తన్నీరముదు'' ఉత్సవం తిరుమలలో సోమవారం ఘనంగా జరిగిందిసాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధి ఆలయ ప్రదక్షిణముగా వాహన మండపానికి వేంచేపు చేశారుతిరుమలనంబి ఆలయం నుండి ప్రదక్షిణ‌గా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని వాహన మండపానికి తీసుకొచ్చారుఅనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్‌ స్వాములుఆచార్య పురుషులుప్రబంధ పండితులు పవిత్ర తీర్థజలంతో ఆలయంలోకి వేంచేపు చేశారు.


అనంతరం ఆల‌య అర్చ‌కులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు సందర్భంగా తిరుమలనంబి రచించిన ''తిరుమొళి పాశురాలను'' పారాయణం చేశారు.


 కార్య‌క్ర‌మంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామితిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామిఆలయ అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments