12.1.26

అన్నపూర్ణ నిలయం శ్రీవారి క్షేత్రం annadanam






కలియుగ ప్రత్యక్ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలువైన తిరుమల పుణ్యక్షేత్రం క్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతోందితిరుమల అంటే కడుపు నిండే క్షేత్రంఆకలి అనేది ఇక్కడ భక్తుడికి తెలియదు.


శ్రీవారి కృపతో పాటుటీటీడీ అన్నప్రసాద విభాగం నిర్వహిస్తున్న హత్తర అన్నప్రసాద వ్యవస్థ ద్వారా ప్రతిరోజూ దాదాపు మూడు లక్షల మంది భక్తులు తృప్తికరమైన భోజనం స్వీకరిస్తున్నారు.


భక్తుల ఆకలే లక్ష్యంగా అన్నప్రసాదం విభాగం కృషి


టీటీడీ అన్న ప్రసాదం విభాగం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంశ్రీ అక్షయవకుళమాత అనే మూడు వంటశాలలు 24 గంటలు నిర్విరామంగా నిచేస్తూ శ్రీవారి సన్నిధికి వచ్చి భక్తుడికి ఆకలి మరిచిపోయేలా న్నం అందిస్తున్నాయివైకుంఠం క్యూలైన్లలో నిలబడి ఉన్న భక్తుడైనా, డైనింగ్ హాల్‌లో కూర్చున్న యాత్రికుడైనాలేదా బయట ప్రాంతాల్లో వేచి ఉన్నవారైనాఎవరూ ఆకలితో ఉండకుండా చూడటమే టీటీడీ లక్ష్యం.


అన్నపూర్ణ నిలయంగా తిరుమల క్షేత్రం:


అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతున్ తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ప్రతి రోజూ 74 వేల మందిశ్రీ అక్షయ వంటశాల రోజుకు 1.48 లక్షల మందికి, వకుళమాత వంటశాల రోజుకు 77 వేల మంది భక్తులకు నాణ్యమైనరుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తున్నారు.


ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ .న్టీ.రామారావు సంకల్పం


ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు సంకల్పంతో 1985 ఏప్రిల్ 6 తేదిన తిరుమలలో శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదాన పథకం ప్రారంభమైంది. 1994 ఏప్రిల్ 1 తేదిన  పథకాన్ని ట్రస్టుగా మార్చడం జరిగింది.


ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా ప్రారంభించడం జరిగింది.


అన్న ప్రసాద విభాగం రోజువారీ తయారు చేసే అన్న ప్రసాదాల వివరాలు :


తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం :


ఉదయం : గోధుమ రవ్వ ఉప్మాసూజి రవ్వ ఉప్మాసేమియా ఉప్మాపొంగలిచట్నిసాంబార్.


మధ్యాహ్నం (8 రకాలు) : స్వీట్ పొంగల్అన్నంకర్రీ, చట్నీవడసాంబార్రసంమజ్జిగ.


సాయంత్రం (8 రకాలు) : స్వీట్ పొంగల్అన్నంకర్రీ, చట్నీవడసాంబార్రసంమజ్జిగ.


శ్రీ అక్షయ వంటశాల :


గోధుమ రవ్వ ఉప్మాసొజ్జి రవ్వ ఉప్మాపొంగలి,  సాంబారన్నంపెరుగన్నంటమోట రైస్సుండలుపాలుటీకాఫీ తయారు చేస్తారు.


భక్తుల రద్దీ అధికంగా ఉండే పర్వదినాలుముఖ్యమైన రోజుల్లో మజ్జిగబాదం పాలుబిస్కెట్లుజ్యూస్ ప్యాకెట్లను కూడా ఇక్కడ నుండి భక్తుల కోసం పంపిణీ చేస్తారు.


వకుళమాత వంటశాల :


వకుళమాత వంటశాలలో యాత్రికుల వసతి సముదాయం-2, 4, 5లోని భోజనశాలలకుబయట ప్రాంతాల్లోని కేంద్రీయ విచారణ కార్యాలయంయాత్రికుల వసతి సముదాయం-1, రామ్ భగిచా అతిథి గృహంఅంజనాద్రి నిలయం కాటేజీల వద్ద ఉన్న క్తులకు పంపింణీ చేసేందుకు సాబారన్నంపెరుగన్నంఉప్మా తయారు చేస్తారు.


దాదాపు వెయ్యి మంది అన్న ప్రసాద విభాగం సిబ్బంది మరియు శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు ఎప్పటికప్పుడు అంతరాయం లేకుండా భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.


No comments :
Write comments