14.1.26

తిరుమలలో లగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు footwear







తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో QR ఆధారిత పాద క్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారుతిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద మంగళవారం ఉదయం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన QR కోడ్ ఆధారిత పాద రక్షలు కౌంటర్ ను ప్రారంభించారు


 సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమల కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాద రక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ QR కోడ్ ఆధారిత ఆధుని పాద రక్షల నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారువైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన  విధానం అద్భు ఫలితాలు ఇవ్వడంతోతిరుమలలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


 విధానంలో భక్తులు తమ పాద రక్షలను కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి QR కోడ్‌తో కూడిన స్లిప్ ఇస్తారని,   స్లిప్‌లో పాద రక్ష సంఖ్యసైజుర్యాక్ నంబర్బాక్స్ నంబర్నిల్వ చేసిన స్థానం వంటి పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారుభక్తులు తిరిగి వచ్చి  స్లిప్‌ను స్కాన్ చేయగానే పాద రక్షలు ఉన్న ఖచ్చితమైన స్థానం డిస్‌ప్లే అవుతుందనితద్వారా అతి తక్కువ సమయంలోనే భక్తులకు పాద రక్షలు తిరిగి అందజేయడం జరుగుతోందని అదనపు ఈవో తెలిపారు.


 వ్యవస్థ అమలుతో ఇప్పుడు దాదాపు 99 శాతం భక్తులు తమ పాద రక్షలను తిరిగి పొందుతున్నారనిగతంలో గుట్టలుగా పడిపోవడం వల్ల సుమారు 70–80 శాతం మంది భక్తులు పా రక్షలు వదిలేసి వెళ్లే పరిస్థితి ఉండేదనిఇప్పుడు  సమస్య పూర్తిగా తొలగిపోయిందన్నారు వినూత్న ప్రాజెక్టును కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తమ CSR కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తోందని పేర్కొన్నారుభక్తుల సౌకర్యంతిరుమల స్వచ్ఛత దృష్ట్యా ఇది దేశంలోనే ఆలయ పరిపాలనలో ఒక అత్యుత్తమ వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొన్నారు.


 సందర్భంగా భక్తులు తమ పాద రక్షలను ఎక్కడ పడితే అక్కడ వదలకుండానిర్దేశిత కౌంటర్లలోనే డిపాజిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.  తద్వారా తిరుమల పరిశుభ్రత మరిం మెరుగుపడుతుందని తెలియజేశారు.


 కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.సత్య నారాయణఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments