23.1.26

ర‌థ స‌ప్త‌మి ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేసిన‌ టీటీడీ చైర్మ‌న్‌ radha saptami







జ‌న‌వ‌రి 25 తేదిన ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా వాహ‌న సేవ‌ల‌ను వీక్షించేందుకు విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లోని గ్యాల‌రీల్లో చేస్తున్ ఏర్పాట్ల‌ను టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడుఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌బోర్డు స‌భ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూశ్రీ‌మ‌తి ప‌న‌బాక ల‌క్ష్మిఅద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌద‌రిల‌తో క‌లిసి గురువారం త‌నిఖీ చేశారు.


 సంద‌ర్భంగా భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారుఅన్న‌ప్ర‌సాదాలు గ్యాల‌రీల్లోని ప్ర‌తి భ‌క్తుడికి చేరేలా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా పంపిణీ చేయాల‌ని చెప్పారు. పారిశుద్ధ్య లోపం త‌లెత్త‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త‌ను తొల‌గించి బ‌య‌ట‌కు త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.


 త‌నిఖీల్లో టీటీడీ సీవీఎస్వో శ్రీ ముర‌ళీకృష్ణ‌సీఈ శ్రీ స‌త్య నారాయ‌ణ‌ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments