25.1.26

టిటిడి పరిపాలన‌ భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి republicday





తిరుపతి టిటిడి పరిపాలన‌ భవనంలో జనవరి 26 తేదీ సోమ‌వారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.


పరిపాలన‌ భవనం వెనక వైపున గల ప‌రేడ్‌ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్‌ ఉదయం 8.30 గంటలకు జాతీ జెండాను ఎగురవేస్తారుఅనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారువిధినిర్వ‌హ‌ణ‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.


 సందర్భంగా టీటీడీ భద్రతా విభాగంలోని బెటాలియన్ల ప‌రేడ్విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.


 కార్యక్రమంలో టిటిడిలోని ఉన్నతాధికారులువిభాగాధిపతులుఉద్యోగులు పాల్గొంటారు.


No comments :
Write comments