31.1.26

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం teppostavam





తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా 5 రోజు శుక్ర‌వారం సాయంత్రం శ్రీదేవిభూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను క‌టాక్షించారు.  


ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామిఅమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారుఇందులో పాలుపెరుగు, తేనెపసుపుచందనంలతో అభిషేకం చేశారుఅనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవిభూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారునంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.


తెప్పలను అధిరోహించిన స్వామిమ్మ‌వార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారుకాగా శుక్రవారం శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవిభూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలుహరికథసంగీత కార్యక్రమాలు నిర్వహించారు.


 కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామిశ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతిఏఈవో శ్రీ నారాయ‌ణ చౌద‌రిసూపరింటెండెంట్‌ శ్రీ చిరంజీవి, ‌‌విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments