తిరుమల
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు బుధవారం సాయంత్రం శ్రీవారి ఆలయ ప్రాంగణం, లడ్డూ కౌంటర్ల వద్ద తనిఖీలు నిర్వహించారు.
టీటీడీ కల్పించిన సౌకర్యాలపై శ్రీవారి ఆలయం వద్ద వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని వెలుపలకు వచ్చిన భక్తులతో స్వయంగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దర్శన క్యూలైన్లలో ఎలాంటి అసౌకర్యానికి తావు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసిందని భక్తులు చైర్మన్ వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం లడ్డూ కౌంటర్ వద్దకు చేరుకున్న చైర్మన్ లడ్డూ విక్రయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని, కావాల్సినన్ని లడ్డూలు దొరుకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా రోజుకు 4.80 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నట్లు చైర్మన్ కు వివరించారు. అన్ని కౌంటర్లు తెరిచి ఉంచి ఎలాంటి జాప్యం లేకుండా భక్తులకు లడ్డూలు విక్రయించాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీల్లో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments