3.1.26

టిటిడి అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలి – టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ttd eo




టిటిడి అనుబంధ ఆలయాల్లో క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలోఅందుకు అనుగుణంగా మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారుశుక్రవారం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.


 సందర్భంగా ఈవో మాట్లాడుతూతిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి విచ్చేసే దివ్యాంగ భక్తులు సౌకర్యంగా రాకపోకలు సాగించేందుకు చెక్క బల్లలతో బల్లపరుపు (వుడెన్ ర్యాంప్ను ఏర్పాటు చేయాలన్నారుఅదేవిధంగా సెల్ ఫోన్,   లగేజీ కౌంటర్లుతాగునీరు తదితర మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారుఇప్పటికే ఉన్న మరుగుదొడ్లను మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు చంటి పిల్లలకు తల్లులు సౌకర్యవంతంగా పాలిచ్చేందుకు ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేయాలన్నారుభక్తులు వచ్చే రాకపోకలకు అనుగుణంగా క్యూలైన్లుభక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రవేశ ద్వారం వద్ద లోహాలను గుర్తించే భద్రతా పరికరాలను  ఏర్పాటు చేయాలన్నారు.


శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తి భావం మరింత ఉట్టిపడేలా పరిసరాలను పరిశుభ్రంగాఆకర్షణీయంగా ఉంచడంతో పాటు మెరుగైన విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని సూచించారుఎక్కడైనా లీకేజీలు ఉంటే అరికట్టాలనినార్త్ మాడసౌత్ మాడ వీధుల్లో డ్రైనేజీ సక్రమంగా ఉండేలా తిరుపతి కార్పొరేషన్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని తెలిపారుశ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ మహా రథంకు సంబంధించి బీహెచ్ ఈఎల్ అధికారులతో సంప్రదించి మరమ్మత్తులు చేపట్టాలన్నారుస్వామి వారు విహరించే వాహనాలుతండ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.


తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు టిటిడి అనుబంధ ఆలయాలను అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారని నేపథ్యంలో భక్తులకు మరిం మెరుగైన ఏర్పాట్లు చేపట్టేలా సంబంధిత ఆలయాల అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారుఅనుబం ఆలయాలలో భక్తుల రద్దీకి తగ్గట్లు అవసరమైన పార్కింగ్ , మౌళి సదుపాయాలు ఏర్పాటు చేయాలనిసెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని  సూచించారు.


 కార్యక్రమంలో జేఈవో శ్రీ వివీరబ్రహ్మంఎఫ్‌ఏ అండ్ సీఏవో శ్రీ బాలాజీచీఫ్ ఇంజనీర్ శ్రీ టి.విసత్యనారాయణఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments