టిటిడి కళ్యాణ మండపాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తుల నుండి అభిప్రాయం సేకరించేందుకు హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా, టిటిడి కళ్యాణ మండపాలకు సంబంధించి భక్తుల నుండి స్థానిక శ్రీవారి సేవకుల ద్వారా ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం ద్వారా నిర్వహణ, ఏ ఏ సౌకర్యాలు అవసరమో తెలుసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కళ్యాణ మండపాల నిర్వహణను ఎఫ్ ఎం ఎస్ పరిధిలోకి తీసుకువస్తే పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాల నిర్వహణ మరింత సులభతరం అవుతుందన్నారు,
దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి కళ్యాణ మండపాలలో కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు, కళ్యాణ వేదిక, అలంకరణ, వివాహ వేడుకలను నిర్వహించేందుకు అనువుగా ఉన్నాయా, పార్కింగ్ సౌకర్యం, వర్షాకాలంలో లీకేజీలు ఉన్నాయా, కల్యాణ మండపాలలో నీటి నిల్వలు అధికంగా ఉన్నాయా, సెక్యూరిటీ తదితర అంశాలపై అభిప్రాయాలను సేకరించడం ద్వారా మరింత మెరుగైన సౌకర్యాల ఏర్పాటు చేయవచ్చని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజనీర్ శ్రీ టి.వి.సత్యనారాయణ, ఎఫ్ ఏ అండ్ సీఏవో శ్రీ ఓ బాలాజీ తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments