VIDEO
శ్రీనివాసమం గాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్ వరస్వామి వారి బ్రహ్మోత్సవాల కు ఫిబ్రవరి 07 వ తేదీన అంకు రార్పణ జరుగనుంది . ఆలయంలో ఫి బ్రవరి 08 నుండి 16 వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్ నాయి .
ఈ సందర్భంగా 07 వ తేదీ శనివారం సా యంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్ రహణం, సేనాధిపతి ఉత్సవం, అం కురార్పణ కార్యక్రమాలు నిర్వ హిస్తారు.
ఫిబ్రవరి 8 న ధ్వజారోహణం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివా రి బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవ రి 8 న ఉదయం 8.15 నుండి 8.35 గం టల మధ్య కుంభ లగ్నంలో ధ్వజా రోహణం జరుగనుంది. అంతకుముం దు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్ తారు. రాత్రి 7 నుండి 8 గంటల వ రకు పెద్దశేష వాహనసేవ జరు గనుంది.
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివా రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూ ర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువపంది ళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్ లులు తీర్చిదిద్దారు. శ్రీనివా స మంగాపురం పరిసర గ్రామాలలో వి స్తృతంగా ప్రచారం చేపట్టారు. వా హనసేవల సమయంలో భక్తులకు అన్న ప్ రసాదాలు, మజ్జిగ, పాలు, తాగునీ రు, వైద్య, పార్కింగ్, క్యూలైన్ లు, భద్రత తదితర సేవలను అందిం చనున్నారు.
ఆకట్టుకునేలా అలంకరణలు :
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భ క్తులను ఆకట్టుకునేలా విద్యుత్ , పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు . బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పా టు అలంకరణకు సంబంధించి దాదాపు 1 0 టన్నుల పుష్పాలను వినియోగిం చనున్నారు. ఇందులో సంప్రదాయ పు ష్పాలతో పాటు విదేశీజాతుల పుష్ పాలు కూడా ఉన్నాయి. వాహనసేవల్లో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఆకట్టుకుంటు న్నాయి.
ఆలయ నేపథ్యం : ఈ ఆలయాన్ని తాళ్ లపాక అన్నమాచార్యుల మనుమడు శ్రీ చిన తిరుమలయ్య పునరుద్ధరించినా రు. ప్రకృతి వైపరీత్యాలకు యవనుల దండయాత్రలకు లోలై శిథిలమైన ఈ గు డి, గోపురాలను పునర్నిర్మించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిత్ యపూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు, ఊరేగింపులను చినతిరు మలయ్య నిర్వహించినట్లు 22 మార్ చి, 1540 సంవత్సరం నాటి శాసనం చెబు తోంది. అర్చకులు సుందరాజ స్వామి వారి నుండి 1967 లో తిరుమల తిరు పతి దేవస్థానములు వారు చేపట్టి శ్రీవైఖానస ఆగమోక్తంగా దేవాలయ పు నరుద్ధరణ, భక్తులకు వసతులు, ని త్య దిట్టం ఏర్పాటు చేసి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ని దర్శించుకునే అవకాశం కల్పిం చారు. 1981 నుండి శ్రీకళ్యాణ వేంకటేశ్ వర స్వామి వారికి నిత్య కళ్యాణం , సాక్షాత్కార, బ్రహ్మోత్సవ వై భవాలను నిర్వహిస్తున్నారు. నం వబర్ 2007 లో మహా సంప్రోక్షణ అత్ యంత వైభవంగా టిటిడి నిర్వహించిం ది.
బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉదయం 8 గం. ల నుండి 9 గం. ల వరకు, రాత్ రి 7 – 8 గం. ల వరకు స్వామివారు వాహన సే వలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్ నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వి వరాలు :
తేదీ
08-02-2026
ఉదయం – ధ్వజారోహణం ( కుంభ లగ్ నం- ఉ. 8.15 నుండి 8.35 గంటల వరకు)
రాత్రి – పెద్దశేష వాహనం
09-02-2026
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
10-02-2026
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
11-02-2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
12-02-2026
ఉదయం – పల్లకీ ఉత్సవం( మోహినీ అవ తారం)
రాత్రి – గరుడ వాహనం
13-02-2026
ఉదయం – హనుమంత వాహనం
మధ్యాహ్నం- వసంతోత్సవం ( మ. 2 నుండి 3 గంటల వరకు)
సాయంత్రం – స్వర్ణరథం( సా. 4 నుండి 5 గంటల వరకు)
రాత్రి – గజ వాహనం
14-02-2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
15-02-2026
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
16-02-2026
ఉదయం – చక్రస్నానం( ఉ. 9.55 నుండి 10.15 గంటల వరకు)
రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు)
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్ య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రా జెక్ట్ ఆధ్వర్యంలో కళాకారులు ప్ర తిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు , భజన కార్యక్రమాలను, అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
No comments :
Write comments