6.2.26

ఫిబ్ర‌వ‌రి 7న శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ – ఫిబ్రవరి 8న ధ్వజారోహణం ankurarpanam




తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఫిబ్ర‌వ‌రి 7న‌ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారుఫిబ్ర‌వ‌రి 8 నుండి మార్చి 17 తేదీ వరకు ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.


అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వ‌నున్నారు త‌రువాత సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వ‌హిస్తారు.


ఫిబ్ర‌వ‌రి 8 ధ్వజారోహణం :

     

ఫిబ్ర‌వ‌రి 8 ఉదయం 6.05 గంటలకు మ‌క‌ర‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవంరాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.


 సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కురాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామిఅమ్మ‌వార్ల‌కు పురవీధుల్లో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.


No comments :
Write comments