శ్రీ
కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి.
సాయంత్రం 6 గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు.
ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, కంకణ బట్టర్ శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.
No comments :
Write comments