9.2.26

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం – బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : ఈవో శ్రీ ఎం. రవిచంద్ర kalyana venkateswara swmay varu








శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం దయం 8.15 నుండి 8.35 గంటల మధ్య కుంభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయివేదపండితుల మంత్రోచ్ఛారణలుమంగళవాయిద్యాలుభక్తుల గోవింద నామస్మరణ నడుమ  కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.


అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారుఅనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధనవాస్తుహోమంగరుడ లింగహోమంగరుడ ప్రతిష్ఠరక్షా బంధనం చేపట్టారు. మీన‌ లగ్నంలో శ్రీదేవిభూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారుఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించిపూజలు చేసిధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.


18 గణాలనుముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యంకంకణబట్టార్‌ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో  కార్య‌క్ర‌మం జ‌రిగింది.


బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : ఈవో శ్రీ ఎంరవిచంద్ర


టీటీడీ ఈవో శ్రీ ఎంరవిచంద్ర మీడియాతో మాట్లాడుతూధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారుఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 8 నుండి 16 తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారుస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు


బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 12 గరుడసేవఫిబ్ర‌వ‌రి 13 స్వర్ణరథోత్సవంఫిబ్ర‌వ‌రి 15 రథోత్సవంఫిబ్ర‌వ‌రి 16 క్రస్నానం జరుగనున్నట్టు వివరించారు.


గరుడ సేవ రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు


 కార్యక్రమంలో జేఈవో శ్రీ వివీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీ కే.విమురళీకృష్ణఆలయ ప్ర‌త్యేకాధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌విప్రత్యేక శ్రేణి డెప్యూటీ వో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్‌సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న శేఖ‌ర్‌ఆలయ అర్చకులుఇత‌ర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments