శ్రీ
కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యమాలు భక్తిభావాన్ని పంచాయి
ఇందులో భాగంగా సాయంత్రం 5:30 గంటలకు డా||వై .పరమేశ్వరయ్య గాత్రకచేరి భక్తులను అలరించాయి. ఇందులో " వినాయకాయ...., సురసేనాపతి...., కామాక్షి లోక సాక్షిణి.... " అను కృతులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తదుపరి 6:30 గంటలకు శ్రీమతి శైలజ బృందం " గణేశ పంచరత్నం...., లింగాష్టకం...., శివాష్టకం....., శివ తాండవ స్తోత్రం... " వంటి కీర్తనలు పాడి ప్రేక్షకులను అలరించారు.
తరువాత 7:30 నుంచి 8:30 వరకు శ్రీమతి ఇందుమతి బృందం " పుష్పాంజలి..., నటేశ కౌతం...., భో శంభో...., జతిస్వరం...., దేవీ స్తుతి... ,శంకర శ్రీగిరి నాథ ప్రభో.... " కీర్తనలకు నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
No comments :
Write comments