తిరుపతి
శ్రీ
గో
విందరాజస్వామివారి
తెప్పోత్సవా
ల్లో
భాగంగా
6వ
రోజు
శనివారం
సా
యంత్రం
శ్రీదేవి
, భూదేవి
సమేతం
గా
శ్రీ
గోవిందరాజస్వామివారు
తె
ప్పలపై
విహరించి
భక్తులకు
దర్
శనమిచ్చారు
.
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
తెప్పలను అధిరోహించిన స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఎఫ్ ఏ అండ్ సీఏవో శ్రీ ఓ బాలాజీ, ఎస్ ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ ఎ. నరసింహ మూర్తి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, వీజీవో శ్రీ సురేంద్ర, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, డీఈ శ్రీ రవిశంకర్ రెడ్డి, అర్చకులు , సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments