టిటిడి
ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో శుక్రవారం షటిల్, టెన్నికాయిట్,చెస్, డాంగ్జీబాల్, క్యారమ్స్, పాసింగ్ ది లగేజ్ పోటీలు జరిగాయి. ఆ పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.
– టీటీడీ పురుషుల ఆఫీసర్స్ సింగిల్స్ షటిల్ పోటీలలో శ్రీ బి. సురేందర్ విజయం సాధించగా, శ్రీ పి. ధనుంజయుడు రన్నరప్గా నిలిచారు.
– టెన్నికాయిట్ మహిళా ఆఫీసర్స్ సింగిల్స్ పోటీలో బి. సులోచన రాణి విన్నర్ గా నిలవగా, డా. సుహర్ లత దాసరి రన్నర్ గా నిలిచారు.
• టెన్నికాయిట్ మహిళా ఆఫీసర్స్ డబుల్స్ పోటీలలో బి. సులోచన రాణి, జి. దామర సెల్వి విన్నర్ గా నిలవగా, డా. వి. కృష్ణవేణి, డా. బి. భారతి లు రన్నర్ గా నిలిచారు.
– 45 ఏళ్ల లోపు పురుషుల చెస్ పోటీలో పి. గోపినాథ్ విన్నర్ గా నిలువగా, బి. భారత్ రన్నర్ గా నిలిచారు.
– 45 ఏళ్ల పైబడిన బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో ఓ. ఓబుళ రెడ్డి విన్నర్ గా, ఎం. సురేంద్ర బాబు రన్నర్ గా నిలిచారు.
– 45 ఏళ్లు పైబడిన డాంగ్జిబాల్ పోటీలో ఎం. మనీష విన్నర్ గా, ఎన్. మనోజ రన్నర్ గా నిలిచారు.
– 45 ఏళ్లు పైబడిన మహిళా సింగిల్స్ క్యారమ్స్ పోటీలో టి. తేజశ్వని విన్నర్ గా, డి. శ్రీదేవి రన్నర్ గా నిలిచారు.
– 45 ఏళ్లు పైబడిన మహిళా డబుల్స్ క్యారమ్స్ పోటీలో టి.రాజేశ్వరి, ఎన్. సుధా రాణి విన్నర్స్ జట్టుగా, జే. హెచ్ . స్వప్న మంజరి, కే. ఏ. రూపా రాణి జట్టు రన్నర్స్ జట్టుగా నిలిచారు.
– పాసింగ్ ది లగేజ్ ప్రత్యేక ప్రతిభవంతుల కామన్ పోటీలో ఎల్. విద్యాసాగర్ రెడ్డి విన్నర్ గా, కె. రవి కుమార్ రన్నర్ గా నిలిచారు.
– బధిరుల పురుషుల విభాగం చెస్ పోటీలో సి. నాగరాజన్ విన్నర్ గా, బి. శ్రీకాంత్ రన్నర్ గా నిలిచారు.
– బధిరుల మహిళల విభాగం చెస్ పోటీలో బి. గౌరి విన్నర్ గా, బి. నాగలక్ష్మీ రన్నర్ గా నిలిచారు.
No comments :
Write comments