3.2.26

శ్రీవారి వైద్య సేవకులకు సౌకర్యాలపై చర్యలు - టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ ttd addl je0o





టిటిడిలో త్వరలో ప్రారంభించనున్న శ్రీవారి వైద్య సేవకులకు
 అవసరమైన సౌకర్యాల కల్పనపై చర్యలు చేపట్టినట్లు టిటిడి జేఈవో (వైద్యం & విద్యడాశరత్ వెల్లడించారుఎస్వీ ఆయుర్వేద వైద్యశాలస్విమ్స్ఎస్వీ వేదిక్ యూనివర్శిటీలోని అవసరమైన భవనాల నవనీకరణలో భాగంగా అధికారులతో లిసి ఆయన సోమవారం పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూగౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిటిడిలో శ్రీవారి వైద్య సేవకు అవసరమైన వైద్య రంగంలోని వివిధ విభాగాల నిపుణులకు అవసరమైన వసతి సౌకర్యం కల్పించేందుకు వీలుగా ఎస్వీ ఆయుర్వేద వైద్యశాలస్విమ్స్ఎస్వీ వేదిక్ యూనివర్శిటీలోని వసతి గదులను పరిశీలించామన్నారుసంబంధిత వైద్యులు వైద్య సేవ చేసేందుకు వీలుగా వారం రోజుల పాటు బస చేసేందుకు  వసతి గదుల నవనీకరణమౌళిక సౌకర్యాలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.


తిరుపతితిరుమలలో ఉన్న టీటీడీ ఆస్పత్రుల్లో ముఖ్యంగా అశ్వినీ ఆసుపత్రిఆయుర్వేదస్విమ్స్బర్డ్చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేందుకు శ్రీవారి వైద్య సేవను త్వరలోనే ప్రారంభించేందుకు వీలుగా చర్యలు చేపట్టామన్నారు.  వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాల వైద్య నిపుణులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని జేఈవో తెలిపారుఇప్పటికే టిటిడిలోని వివిధ విభాగాలలో శ్రీవారి సేవకులు వారం రోజులకు గాను 4 వేల మంది శ్రీవారి సేవకులు నిస్వార్థంగా  సేవలు అందిస్తున్నారనిదాదాపు 17 లక్షలకు పైగా శ్రీవారి సేవకులు సేవలు అందించారన్నారుశ్రీవారి సేవను వైద్యవిద్యఐటీ రంగాలకు విస్తరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.  


 కార్యక్రమంలో టీటీడీ సీఎంఓ డాకుసుమ కుమారిఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డారేణు దీక్షిత్బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డావెంకట రెడ్డిస్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్ఎస్‌ఈలు శ్రీ వేంకటేశ్వర్లుశ్రీ మనోహరంశ్రీ నరసిం మూర్తిఆర్ఎంఓ డాక్టర్ భరత్, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


No comments :
Write comments