శ్రీ వారి వైద్య సేవపై టిటిడి ఆరోగ్యం మరియు విద్య విభాగాల జెఈఓ డా. శరత్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశం శనివారం జెఈఓ (హెచ్ & ఈ) కార్యాలయ ఛాంబర్లలో జరిగింది.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ఆసుపత్రుల్లో అవసరమైన నిపుణులు లేదా వైద్యుల సంఖ్యపై నివేదిక రూపొందించాలని సంబంధిత విభాగాధిపతులను ఆయన ఆదేశించారు.
అలాగే శ్రీ వారి వైద్య సేవ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన యాప్లో అవసరమైతే మార్పులు చేయాలని జీఎం ఐటీ శ్రీ ఫణికుమార్ నాయుడును జెఈఓ సూచించారు.
ఈ సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్.వి. కుమార్, శ్రీ పద్మావతీ చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డి, టీటీడీ సీఎంఓ డా. కుసుమ కుమారి, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా. రేణు దీక్షిత్, బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. వెంకట రెడ్డి, ఎస్ఈ శ్రీ మనోహరం, చీఫ్ పీఆర్వో డా. రవి తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments