టిటిడి
ఉన్నత పాఠశాలలలో విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ అధికారులకు సూచించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఉన్నత పాఠశాలను ఆయన అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలు, విద్యార్థుల ప్రగతిని ఆయన సమీక్షించారు.
జేఈవో మాట్లాడుతూ, ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థులను మరింత జాగురూకతతో తయారు చేయాలని అధ్యాపకులకు సూచించారు. రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో ప్రథమ స్థానాలు సాధించేలా లక్ష్యంతో విద్య బోధించాలని కోరారు.
వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి సులభమైన పద్ధతుల్లో అవగాహన కల్పిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. టిటిడి విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఉపాధ్యాయులు ఆసక్తితో, అత్యుత్తమ ప్రమాణాలతో బోధన చేపట్టాలని చెప్పారు. విద్యార్థుల ప్రతిభను పెంపొందించేందుకు రోజువారీ, వారాంత పరీక్షలు నిర్వహించి, వారి ప్రగతిని నిరంతరం పరిశీలించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డీఈవో శ్రీ వెంకట సునీలు, ఎస్.జీ.ఎస్. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రయ్య, ఎస్.ఈ శ్రీ మనోహరం, అదనపు హెల్త్ ఆఫీసర్ డా. సునీల్, ఉపాధ్యాయులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments