11.3.26

మార్చి 11న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 47వ వర్ధంతి




శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచిన సంగీతసాహిత్ విద్వాంసులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 47 వర్ధంతి కార్యక్రమం మార్చి 11 బుధవారం జరుగనుంది.


టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ మ‌రియు పిజి క‌ళాశాల ప్రాగ‌ణంలోని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విగ్ర‌హానికి పుష్పాంజ‌లి స‌మ‌ర్పిస్తారుఅనంత‌రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉద‌యం 10.30 గంటలకు సాహితీ స‌ద‌స్సుతో కార్యక్రమం ప్రారంభం కానుంది.

 

శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో 1893, జనవరి 23  జన్మించారుమైసూరు మహారాజ కళాశాలలో 3సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా సేవలందించారురేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టింది వీరేవీరి ప్రతిభను గుర్తించి అప్పటి టీటీడీ ఈవో శ్రీ చెలికాని అన్నారావు 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను అప్పగించారుఅప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన సంకీర్తనలను పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారుసంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారుశ్రీఅనంతకృష్ణశర్మను 1979, మార్చి 11 టీటీడీ  ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.


No comments :
Write comments