1.3.26

రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం ttd budget









టీటీడీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపిందని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు వెల్లడించారురాష్ట్ర ప్రభుత్వం కూడా  బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.


తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ ఎం.ర‌విచంద్ర‌తో కలసి శ‌నివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారుముఖ్యాంశాలు……


•  గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా  చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో టీటీడీ బోర్డు స‌బ్ క‌మిటీ సిఫార్సుల మేర‌కు టీటీడీ చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీవిద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన‌ విద్యను అందించేందుకు గాను రూ.118.89 కోట్లు కేటాయింపుఇందులో భాగంగా డిజిటల్ క్లాస్ రూములుఅదనపు హాస్టల్ బ్లాకులువంట గదుల ఆధునీకరణఇత‌ర మౌళిక స‌దుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేందుకు ఆమోదం.


•  భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీ‌వారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం “శ్రీవారి ముడుపు పత్రం పథకం” ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాంప్ర‌స్తుతం భక్తులు మొక్కు రూపంలో శ్రీవారి హుండీలో కానుక‌లు వేస్తున్నారుఇందుకు బదులుగా భక్తులు తిరుమ‌ల‌లో ఏర్పాటు చేసే కౌంట‌ర్ల‌లో UPI ద్వారా చెల్లింపులు చేస్తే అందుకు త‌గిన ముడుపు ప‌త్రాలు అంద‌జేస్తారువాటిని నేరుగా శ్రీ‌వారి హుండీలో వేయ‌వ‌చ్చుత‌ద్వారా భ‌క్తులు న‌గ‌దునాణేలు తీసుకువ‌చ్చేందుకు ఉన్న ఇబ్బందులు తొల‌గుతాయి.


•  తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో అన్న ప్రసాద భవనంఆధునిక వంటశాలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించేందుకు రిలయన్స్ సంస్థ రూ.100 కోట్ల నుండి రూ.120 కోట్లు విరాళం అందించేందుకు ముందుకు రావడంతో పనులు ప్రారంభించేందుకు ఆమోదం.


•  ఆలయాలుప్రాకారాలురాజ గోపురాలు త‌దిత‌ర‌ నిర్మాణాల‌కు య్యే ఖర్చును దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా శ్రీ‌వాణి ట్ర‌స్టు మార్గదర్శకాలను మార్పు చేసేందుకు ఆమోదం.


•  ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్ర‌హం ఏర్పాటుకు గాను డ్రై ఐల్యాండ్ నిర్మించేందుకు నిర్ణయంఅందుకుగాను రూ.20.17 కోట్లతో పనులకు ఆమోదం.


•  కోయంబత్తూర్గువహటిబెలగావిఅదేవిధంగా పాట్నా వ‌ద్ద మోకామ‌ నగరంలో శ్రీవారి ఆలయాల నిర్మాణాల‌కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టీటీడీకి కేటాయించిన భూమిని తీసుకునేందుకు ఆమోదం.


•  వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభాస్య కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం.


•  ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1 తేదీన జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే దాదాపు 70 వేల మంది భక్తులకు  ఏడాది అదనంగా రూ.50 విలువ చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించాంగత ఏడాది తలంబ్రాల ప్యాకెట్ కిట్‌ను అందించి విషయం తెలిసిందే.


•  ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులను ఆకట్టుకునేలా రూ. 4.25 కోట్లతో విద్యుత్ అలంకరణలుపబ్లిక్ అడ్రస్ సిస్టమ్ఎల్ఈడి బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.


-  ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్ మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తిరుపతిలో 356 మందితిరుమలలో 371 మంది భద్ర సిబ్బంది నియామకానికి ఆమోదం.


-   అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో ఎక్స్ రే బ్యాగేజ్ స్కానర్లుడోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుకు ఆమోదం.


•  తిరుమలతిరుపతిలోని టీటీడీ గోశాలలుపలమనేరులోని శ్రీవేంకటేశ్వర ఇంక్యూబేషన్ సెంటర్ లలో రూ.11.28 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం.


•  టీటీడీ ఆలయాల్లో పరిచారకులుగా పని చేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు గాను ప్ర‌భుత్వానికి నివేదించాల‌ని నిర్ణ‌యం.


-   పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ వేంకటేశ్వర దివ్య క్షేత్రం నిర్మాణానికి రూ.14.25 కోట్లు కేటాయింపు.


-  తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్లుడ్రైనేజీ త‌దిత‌ర‌ అభివృద్ధి పనులకు ఆమోదం.


-   దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలుసత్రాలువిశ్రాంతి భవనాలుయాత్రికుల వసతి సముదాయాలువిద్యా సంస్థలుఆసుపత్రులుకల్యా మండపాల భద్రతను పర్యవేక్షించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు మోదం.


-  ఇటీవ‌ల చాలామంది త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం తిరుమ‌ల‌లో అస‌త్య క‌థ‌నాల‌తో రీల్స్ చేసి సోషియ‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారుఎంతో భ‌క్తితో తిరుమ‌ల పుణ్య‌క్షేత్రానికి వ‌చ్చే భ‌క్తుల మ‌నోభావాలను దెబ్బ‌తినేలా పోస్టు పెట్టేవారిపై చ‌ట్ట‌ప‌ర‌మై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టీటీడీ హెచ్చ‌రిస్తోంది.


 కార్యక్రమంలో టిటిడి బోర్డు స‌భ్యులుఅద‌న‌పు ఈవో శ్రీ

No comments :
Write comments