టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.70 లక్షలు విరాళంగా అందింది. నెల్లూరు జిల్లాకు చెందిన శంకర్ ఎంటర్ ప్రైజెస్ అధినేత శ్రీ జయశేఖర్ రూ.10 లక్షలు, చిత్తూరుకు చెందిన బాలాజీ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ శ్రీ రమేష్బాబు రూ.10 లక్షలు, వినాయక ఫౌల్ట్రీఫాం అధినేత శ్రీ రాధ శ్రీనివాసులు రూ.10 లక్షలు, చిత్తూరు జిల్లా కొటార్లపల్లికి చెందిన శ్రీ మంజునాథ్ రూ.10 లక్షలు, శ్రీవారి ఫౌల్ట్రీఫాం అధినేత శ్రీ హేమాద్రి రూ.10 లక్షలు, ఫౌల్ట్రీఫాం అధినేత శ్రీ రవికుమార్ రూ.10 లక్షలు, పలమనేరుకు చెందిన ఎస్ ఆర్ ఎస్ ఎంటర్ ప్రైజస్ అధినేత శ్రీ పురుషోత్తం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు విరాళం డిడిలను తిరుపతిలోని ఈవో బంగ్లాలలో టీటీడీ ఈవో శ్రీ ఎం.రవిచంద్రకు అందజేశారు.
No comments :
Write comments