అన్నమయ్య
కీర్
తనల్లో
తెలుగు
వివాహ
సంప్రదాయా
లు
, ఆచారాలు
సజీవంగా
ప్రతిబింబిం
చినట్లు
, భక్తి
, సాంస్కృతిక
వి
లువలను
సమన్వయంతో
తెలియజేస్తా
యని
చిత్తూరు
ప్రభుత్వ
కళాశాల
తె
లుగుశాఖాధ్యక్షులు
డా
. ఉషారాణి
పేర్కొన్నారు
. శ్రీ
తాళ్లపాక
అన్న
మాచార్యులవారి
523వ
వర్ధంతి
ఉత్
సవాల్లో
భాగంగా
తిరుపతిలోని
అన్
నమాచార్య
కళామందిరంలో
నిర్వహిస్
తున్న
సాహితీ
సదస్సులు
బుధవారం
మూడవ
రోజుకు
చేరుకున్నాయి
.
ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన డా.ఉషారాణి “అన్నమయ్య – కళ్యాణ సంకీర్తనలు” అనే అంశంపై ఉపన్యసిస్తూ, అన్నమయ్య కాలంలోని సామాజిక పరిస్థితులు, సంప్రదాయాలను ఆయన కళ్యాణ కీర్తనల్లో ప్రతిబింబించారని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలమేలు మంగల అమ్మవారి దివ్య కల్యాణాన్ని వర్ణించే ఈ పెళ్లి పాటలు తెలుగు వివాహాలలో ప్రధానంగా వినిపిస్తూ, ఆచార వ్యవహారాలు మరియు భక్తి భావాలను సమన్వయంగా ప్రతిబింబిస్తాయని చెప్పారు. మంగళహారతులు, తలంబ్రాల పాటలు, నలుగు పాటలు వంటి వివాహ సంప్రదాయాలు అన్నమయ్య సంకీర్తనల్లో విశిష్ట స్థానం పొందినట్లు ఆమె వివరించారు.
టీటీడీ ప్రచురణల విభాగం ఉప సంపాదకులు డా|| నరసింహాచార్య ''అన్నమయ్య - నరసింహ కీర్తనలు'' అనే అంశంపై , హంపిలో 1400వ సంవత్సరానికి శ్రీ నారసింహ ఆలయం ఉన్నట్లు, అన్నమయ్య ఆరు కీర్తనలలో శ్రీ నారసింహస్వామిని కీర్తించినట్లు వివరించారు. అన్నమయ్య హంపిలోని వివిధ ఆలయాలను దర్శించి నాటి వైభవాన్ని, సామాజిక జీవనాన్ని కూడా అద్భుతంగా వర్ణించారని ఆయన తెలిపారు. అన్నమయ్య దర్శించిన క్షేత్రాలు, ప్రాంతాలను సంకీర్తనల్లో పొందుపరచడం వల్ల ఆనాటి చరిత్రను తెలియజేశారని తెలిపారు. అప్పటి వరకు ఉన్న పద్య, గద్యం కాకుండా పద కవితలతో జన బాహుళ్యంలోకి భక్తి తత్వన్ని తీసుకు వెళ్ళిన్నట్లు తెలిపారు.
తిరుపతికి చెందిన విశ్రాంతాచార్యులు డా.వెంకటరమణారెడ్డి " అన్నమయ్య - తాత్త్వికత " అనే అంశంపై ఉపన్యసిస్తూ, వైరాగ్యం, విరక్తి, కోర్కేలు లేక పోవడం వంటి వాటిని ప్రభోదిస్తూ, ప్రజలను ఆధ్యాత్మికత, మోక్ష మార్గంలో నడేపేందుకు అన్నమయ్య సంకీర్తనను రచించిట్లు తెలిపారు. వేదాంతాన్ని భక్తి అనే రసగుళిక ద్వారా సామాన్య ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అన్నారు. నామ సంకీర్తన, నామ జపంతో జాతి, కుల, మతాలకతీతంగా భగవంతుని చేరవచ్చని తెలిపారు. శ్రీవారిని సంకీర్తన ద్వారా సామాన్యులకు చేరువ చేసేందుకు అన్నమయ్య కృషి చేసినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా.మేడసాని మోహన్, సంచాలకులు శ్రీమతి లత, ఇతర అధికారులు, పుర ప్రజలు పాల్గొన్నారు.
అన్నమాచార్య కళామందిరంలో :
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 గంటలకు విజయవాడకు చెందిన శ్రీ కోదండరామయ్య బృందం, రాత్రి 7 గంటలకు తిరుపతికి చెందిన శ్రీరఘునాథ్ బృందం భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మహతి కళాక్షేత్రంలో :
మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి బుల్లెమ్మ బృందం, రాత్రి 7 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి శ్రీదేవి బృందం సంగీత సభ జరుగనుంది.
No comments :
Write comments