చంద్ర
గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేసినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు.
ఆలయ ద్వారాలు మూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్యూలైన్ లో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం చేయించి అనంతరం ఆలయ ద్వారాలు మూసివేనట్లు చెప్పారు. ఆలయ మూత సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు అన్ని చోట్ల పులిహోర ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. సాయంత్రం ఆలయ శుద్ధి, పుణ్యహావచనం అనంతరం భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments