29.3.26

జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం అంతరార్థం : డా. మేడసాని మోహన్ metlotsavam








ధర్మమార్గంలో డుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు క్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని టిటిడి న్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డామేడసాని మోహన్ తెలిపారుశ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523 వర్ధంతిని పురస్కరించుకుని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూపూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారని చెప్పారుఇటువంటి పవిత్రమైన మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌తెలంగాణ‌తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు వెయ్యికి పైగా భజన మండళ్ల సభ్యులుప్రముఖ సంగీత కళాకారులు భజనలు చేస్తూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారుమార్చి 15 ఆదివారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహించనున్నట్లు తెలిపారు.


మెట్లోత్సవంలో సింగపూర్ కళాకారులు :


శ్రీ అన్నమాచార్యుల వారి వర్ధంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు సింగపూర్ నుండి 20 మంది కళాకారులు స్వచ్ఛందంగా విచ్చేశారుసింగపూర్‌కు చెందిన డాకెభాగ్యమూర్తి ఆధ్వర్యంలో “అష్టలక్ష్మి విద్యార్థుల బృందం” శనివారం ఉదయం మెట్లోత్సవంలో పాల్గొంది.


ఆకట్టుకున్న సంకీర్తనల గోష్టిగానం:


ముందుగా అలిపిరి పాదాల మండపం వద్ద అన్నమాచార్య వంశీయులు మెట్లపూజ నిర్వహించారుఅనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం చేశారుఇందులో “బ్రహ్మ కడిగిన పాదము”, “భావములోన బాహ్యమునందును”, “ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు”, “పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమా”, “కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు” వంటి కీర్తనలు ఆలపించారుభక్తులు పరవశించి గోష్టిగానంలో పాల్గొన్నారు.


 కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీమతి లత, అన్నమాచార్య వంశీయులు శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యులుఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పాల్గొన్నారు.


No comments :
Write comments