10.3.26

వెన్నెలను మైమరిపించే విద్యుత్ కాంతుల్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు vontimitta temple






ఒంటిమిట్టలోని పవిత్రక్షేత్రమైన శ్రీ కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు  నెల మార్చి 26 తేదీ నుండి వైభవంగా ప్రారంభంకానున్న నేపథ్యంలోభక్తుల హృదయాలను పరవశింపజేసేలా విద్యుత్ అలంకరణలను టిటిడి అత్యంత వైభవంగా చేపట్టిందివెన్నెలకన్నా వెలుగొందే దీప కాంతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసరింపజేయనున్నాయి.


ఒంటిమిట్ట ఆలయం పరిసరాలుటిటిడి భవనంవాహన మండపంప్రధాన కూడళ్లుఅలాగే ఒంటిమిట్ట నుండి మాధవవరం వరకు ఏర్పాటు చేస్తున్న ద్భుత విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్ర ముగ్ధులను చేయనున్నాయిపండుగ వాతావరణాన్ని మరింత ధురంగా మార్చుతూ బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు చేర్చేలా  ఏర్పాట్లు సాగుతున్నాయి.


ఆలయం లోపల మరియు వెలుపల ప్రాంతాలునాలుగు మాడ వీధులుపుష్కరిణికార్ పార్కింగ్ ప్రాంతంఒంటిమిట్ట పరిసర ప్రాంతాలుకల్యా వేదిక తదితర ప్రాంతాలు రాత్రివేళల్లో రజత కాంతులతో మెరిసిపోతూ బ్రహ్మోత్సవాలకు అపూర్వమైన శోభను చేకూర్చనున్నాయి.


బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్న, మధ్యపెద్ద పరిమాణాల్లో సుమారు 60కు పైగా అద్భుత ఇల్యూమినేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారువీటిలో శ్రీరామ పట్టాభిషేకంశ్రీరామ కల్యాణంఅయోధ్య రాముడుఏనుగు మీద శ్రీవారుగరుత్మంతుడిపై శ్రీవారుశ్రీ పద్మనాభ స్వామిఅమ్మవారి త్రీడీ రూపందశావతారాలుఅష్టలక్ష్ములు వంటి దివ్యరూపాలు విద్యుత్ కాంతుల్లో ప్రతిఫలిస్తూ భక్తులకు ధ్యాత్మిక శోభను  పంచనున్నాయి.


అదేవిధంగా 20 వేల సీరియల్ సెట్స్, 10 వేల ఫ్లడ్ లైట్లు, 350 రంగురంగుల లైట్లు, 40 జనరేటర్లుతోరణాలునైన్ వాట్స్ తోరణాలతో ఒంటిమిట్ట అంతా ప్రకాశవంతంగా మారి భక్తులకు కనువిందు చేయనుంది.


ప్రత్యేక ఆకర్షణగా కల్యాణ వేదిక


ఏప్రిల్ 01 జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంను వీక్షించేందుకు వేలాది భక్తులు తరలి రానున్న నేపథ్యంలోవారి సౌకర్యార్థం కల్యాణ వేదిక పరిసరాలువాహనాల పార్కింగ్ ప్రాంతం మరియు లయ పరిసరాల్లో 23 ఎల్..డి వీడియో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారువీటి ద్వారా భక్తులు ఎక్కడి నుంచైనా శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని కనులారా వీక్షిస్తూ భక్తి పరవశంలో తేలియాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడువో శ్రీ ఎంరవిచంద్రజేఈవో శ్రీ వివీరబ్రహ్మం ఆదేశాలతో ఎలక్ట్రికల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్. (ఎలక్ట్రికల్శ్రీ వెంకటేశ్వర్లుడీఈలు శ్రీ రవిశంకర్ రెడ్డిశ్రీమతి సరస్వతిడిప్యూటీ ఈఈ శ్రీ మురళీకృష్ణ తదితర అధికారులుసిబ్బంది విద్యుత్ అలంకరణలను సిద్ధం చేస్తున్నారు.


No comments :
Write comments