2.4.26

వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి తీర్థ స్నానమాచరించిన 12, 235 మంది భక్తులు tumburu teerdha mukkoti






తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థ ముక్కోటిలో మార్చి 31 మరియు ఏప్రిల్ 01 తారీఖుల్లో 12 వేల మందికి పైగా భక్తులు పాల్గొని తీర్థ మార్చిస్నానాన్ని ఆచరించారు.


టీటీడీ విస్తృత ఏర్పాట్లు


టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు అధికారులు తుంబురు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారుఇందులో భాగంగా మార్చి 31 తేదీ ఉదయం 6 గంట‌ల నుండి నిరంత‌రాయంగా అన్న ప్రసాదాలుమజ్జిగతాగునీరు భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు.


ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లుమార్గమధ్యంలో నిచ్చెనలుతాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారుదీర్ఘకాలిక వ్యాధులుఆస్తమాస్థూల కాయంగుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని, 12 ఏళ్ల లోపు పిల్లలను తీర్థానికి అనుమతించలేదు


పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారుతుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా ప్రకటనలు చేశారు.


ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థంపాపావినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారుఅత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు అంబులెన్స్‌లనుపారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు


మరోవైపు టీటీడీ భద్రతా విభాగంపోలీసులుఅటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.


టీటీడీ కల్పించిన అన్నప్రసాదాలుతాగునీరుఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.


టీటీడీ చేసిన ఏర్పాట్లను  వివిధ విభాగాధిపతులు  పర్యవేక్షించారు.

No comments :
Write comments