17.4.26

ఇంటి నుంచే ప్రారంభమయ్యే ధర్మం – సమాజానికి శాశ్వత దిక్సూచి changanti






నిత్య జీవితంలో సత్యందయక్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకమవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.


టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ళాక్షేత్రంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ధార్మికోపన్యాస కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.


 సందర్భంగా “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై ఉపన్యసించిన యనకాలానుగుణంగా ధర్మంలో మార్పులు వచ్చినా సత్యం ఎప్పటికీ నిలకడగా ఉంటుందని తెలిపారు.


 సత్యంఅహింసదయక్షమసహనం వంటి గుణాలు ధర్మానికి మూలాధారాలనిఇవే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని చెప్పారు.


ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుని సాన్నిధ్యం తప్పక ఉంటుందనిశ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడని వివరించారు.


ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో ధర్మాచరణకు పెద్దపీట వేయాలనిముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడంగురువులను స్మరించడంపెద్దలను ఆదరించడంఅవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మన బాధ్యత అని చెప్పారుసనాతన ధర్మంలో తల్లికి అత్యున్నత స్థానం ఉందనితల్లిని ప్రేమగా చూసుకోవడంసేవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వివరించారు.


అలాగే గోసేవ సనాతన ధర్మానికి ప్రాణస్వరూపం అని పేర్కొంటూప్రతి ఒక్కరూ గోవులను సంరక్షించి సేవించాల్సిన అవసరం ఉందని తెలిపారు.


ధర్మాచరణలో ఓర్పు ముఖ్యమైన గుణమనిఓర్పును మించిన ధర్మం లేదని చెప్పారుశ్రీవేంకటేశ్వర స్వామివారు క్షమాగుణంతో భక్తులపై అపా కరుణ చూపుతున్నారని పేర్కొన్నారు.


ధర్మబద్ధమైన జీవన విధానం ద్వారా వ్యక్తిగత శాంతిసామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారుప్రతి ఒక్కరూ సత్యందయక్షమ వంటి విలువలను ఆచరిస్తూ జీవించడమే నిజమైన భగవద్భక్తి అని పిలుపునిచ్చారు.


చాగంటి వారి ఉపన్యాసాన్ని వినేందుకు విచ్చేసిన భక్తులతో మహతి ళాక్షేత్రం కిక్కిరిసిపోయిందిఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశాలు శ్రోతలను ఆలోచనలో ముంచెత్తి, భక్తి భావాన్ని పెంపొందించాయి.


సమాజంలో నైతికఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారువేదాలుఉపనిషత్తులువేదాంగాల సారాంశాన్ని ప్రజలకు సులభంగా అందిస్తూ విలువలను పెంపొందించాలని చెప్పారు.


టీటీడీ భక్తులకు నిరంతర సేవలు అందిస్తూప్రతి రోజూ ఎందరో భక్తులకు అన్నప్రదాలు న్నట్లు తెలిపారు. “భక్తుల సేవే – భగవంతుడి సేవ” నే భావంతో పనిచేస్తున్న టీటీడీ ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.


అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిజేఈవో ( వైద్యంవిద్యడా..శరత్సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ ఘనంగా సత్కరించింది స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డిజేఈవో (విద్యఆరోగ్యండా. శరత్సీవీఎస్వో శ్రీ కే.విమురళీకృష్ణసిపిఆర్ఓ డాక్టర్ టిరవిడిపిపి అదనపు కార్యదర్శి శ్రీమతి కళ్యాణిడిప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్శ్రీ ఆనందరాజుపలువురు అధికారులుఆధ్యాత్మిక ప్రముఖులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments