ఒంటిమిట్టలోని
శ్రీ కోదండరామాలయం చెంత కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా కల్యాణవేదిక వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.
ఎదుర్కోలు ఉత్సవంలో అమ్మవారి తరఫున అర్చకులు శ్రీ శ్రీనివాస్, స్వామివారి తరఫున శ్రీ రాజేష్స్వామి పాల్గొన్నారు.
No comments :
Write comments