తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకారులు (శ్రీ రామానుజాచార్యులు) వారి సాత్తుమొర బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఉదయం భాష్యకారుల వారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని భాష్యకారుల సన్నిధికి తీసుకువచ్చి ఆస్థానం నిర్వహించారు. రాత్రి స్వామివారు, భాష్యకారుల వారు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వాములు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ, అధికారులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments