23.4.26

తుది దశకు చేరుకున్న ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు sv museum





తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో జరుగుతున్న శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి తెలిపారుబుధవారం సాయంత్రం ఆయన మ్యూజియం ఆధునీకరణ నుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ  ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మ్యూజియం ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులు నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.


సుమారు 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మ్యూజియంలో దాదాపు లక్ష చదరపు అడుగుల మేర నులు పూర్తయ్యాయనిమొత్తం 14 గ్యాలరీలను అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ప్రత్యేక అనుభూతి కలిగేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు.


తిరుమల క్షేత్ర వైభవంఆలయ చారిత్రక నేపథ్యంశాసనాలుఅన్నమాచార్య గ్యాలరీపల్లవులుచోళులువిజయనగర రాజులు వంటి వివిధ రాజవంశీయులకు శ్రీవారితో ఉన్న నుబంధాన్ని గ్యాలరీలలో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.


మ్యూజియాన్ని దీర్ఘకాలిక సుస్థిరతతో ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడంపై కూడా చర్చించామనిభక్తులకు మెరుగైన అనుభవం ల్పించేలా ప్రవేశనిష్క్రమణ సదుపాయాలుక్యాఫెటీరియాసావనీర్ షాప్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు.


భక్తుల తిరుమల యాత్రకు ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక అనుభూతి లిగించేలా  మ్యూజియాన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు.


 కార్యక్రమంలో చీఫ్ మ్యూజియం ఫీసర్ (ఎఫ్ఏసీశ్రీ సోమన్నారాయణఇతర అధికారులుటీసీఎస్ ప్రతానిధులు పాల్గొన్నారు.


No comments :
Write comments