11.4.26

వసంత సుగంధాలలో విరాజిల్లే శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు vasantotsavams




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 30 నుండి మే 02 తేదీ వరకు భక్తివైభవాలతో ఘనంగా నిర్వహించనున్నారుఉత్సవాలకు ముందు ఏప్రిల్ 29 సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుందిభక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవ సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు.


ఉత్సవాల్లో భాగంగా మే 1 తేదీ దయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుందిమూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుందిరాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మా వీధుల్లో అమ్మవారు విహరించి క్తులకు దర్శనమిస్తూ కటాక్షిస్తారు.


 ఏప్రిల్ 28 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


వసంతోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 28 తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం విశేషంగా నిర్వహించనున్నారుఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారుఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజా సామగ్రి మొదలైనవన్నీ విత్రజలంతో శుద్ధి చేయబడతాయి.


నామకోపుశ్రీచూర్ణంకస్తూరి సుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఅనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులకు దర్శనానికి నుమతి ఇస్తారు.


 ఉత్సవాల నిర్వహణ కారణంగా ఏప్రిల్ 28 మరియు ఏప్రిల్ 30 నుండి మే 02 తేదీ వరకు కళ్యాణోత్సవంసహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.

No comments :
Write comments