శ్రీ
తాళ్లపాక
అన్
నమాచార్యుల
వర్ణనా
వైచిత్రి
ని
రుపమానమని
, ఆయన
సంకీర్తనల్లో
శృం
గార
నాయికల
భావాలను
మధురభక్తితో
అద్భుతంగా
ఆవిష్కరించారని
హై
దరాబాద్కు
చెందిన
శ్రీమతి
నా
గపద్మిని
తెలిపారు
. అన్నమయ్య
618వ
జయంతి
ఉత్సవాల్లో
భాగంగా
తి
రుపతిలోని
అన్నమాచార్య
కళామంది
రంలో
సోమవారం
రెండవ
రోజు
సాహితీ
సదస్సు
ఘనంగా
జరిగింది
.
సదస్సుకు అధ్యక్షత వహించిన ఆమె “అన్నమయ్య తీర్చిన అలమేల్మంగా” అనే అంశంపై ఉపన్యసిస్తూ, అన్నమయ్య శృంగార సంకీర్తనల భావ వైశాల్యం అపారమని పేర్కొన్నారు. ఆయన కీర్తనల్లో మధురభక్తి, సాహిత్య సౌందర్యం సమన్వయంగా ప్రతిఫలిస్తుందని వివరించారు.
“పలుకు తేనెల తల్లి…”, “ఏమని పొగడుదమే…”, “అలరులు కురియగా…” వంటి సంకీర్తనల్లో అలమేల్మంగా అమ్మవారిని మాధుర్యభరితంగా వర్ణించిన తీరు విశిష్టమని తెలిపారు.
డా. ఆముదాల మురళి “అన్నమయ్య అద్వైత తత్వం”పై మాట్లాడుతూ, శరణాగతి, లోకనీతి, వేదసారాన్ని సమన్వయపరిచి అన్నమయ్య సాహిత్యం నిర్మించారని చెప్పారు. భక్తి సాహిత్యంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.
డా. షేక్ షావళి “అన్నమయ్య, సూరదాసుల సంకీర్తనల్లో నవవిధ భక్తి” అంశంపై మాట్లాడుతూ, భగవత్ సంకీర్తన ద్వారా మోక్షం సిద్ధిస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్, సంచాలకులు శ్రీమతి లత, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం గాత్ర సంగీతం, నృత్య కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
మహతి కళాక్షేత్రంలో...
మహతి కళాక్షేత్రంలో కూడా సాయంత్రం 6 గం.లకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి సుశీల బృందం భక్తి సంగీత కార్యక్రమం, రాత్రి 7 గం.లకు శ్రీ పద్మ కళాక్షేత్ర డ్యాన్స్ అకాడమీ వారి నృత్య కార్యక్రమం జరుగనుంది.
No comments :
Write comments