1.5.26

న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - బ్రహ్మో త్సవాలకు సర్వం సిద్ధం new delhi temple



న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి లయంలో  గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగిందిఅంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపికొలువుపంచాంగ శ్రవణం నిర్వహించారు.


సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనంమృత్సంగ్రహణంసేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.


 కార్యక్రమంలో న్యూ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ సుమంత్ రెడ్డిఏఈవో శ్రీ బాలరాజుటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రంగనాయక్శ్రీ ఉదయ్ కుమార్ఆలయ అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.


బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం


శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయిఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారుభక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలువిద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.


మే 1 ధ్వజారోహణం :


మే 1 తేదీ శుక్ర‌వారం ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.


వాహన సేవల వివరాలు


 01-05-2026 – ఉదయం ధ్వజారోహణంరాత్రి పెద్దశేష వాహనం


 02-05-2026 – ఉదయం చిన్నశేష వాహనంరాత్రి హంస వాహనం


 03-05-2026 – ఉదయం సింహ వాహనంరాత్రి ముత్యపు పందిరి వాహనం


 04-05-2026 – ఉదయం కల్పవృక్ష వాహనంరాత్రి సర్వభూపాల వాహనం


 05-05-2026 – ఉదయం మోహినీ అవతారంసాయంత్రం కల్యాణోత్సవంరాత్రి గరుడ వాహనం


 06-05-2026 – ఉదయం హనుమంత వాహనంరాత్రి గజ వాహనం


 07-05-2026 – ఉదయం సూర్యప్రభ వాహనంరాత్రి చంద్రప్రభ వాహనం


 08-05-2026 – ఉదయం రథోత్సవంరాత్రి అశ్వ వాహనం


 09-05-2026 – ఉదయం చక్రస్నానంరాత్రి ధ్వజావరోహణం


 దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపను పొందాలని భక్తులను కోరుతున్నారు.

No comments :
Write comments