భక్తులకు టీటీడీ వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా శ్రీవాణి ఆన్ లైన్ విధానాన్ని ఈ క్రింది విధంగా అమలు చేయడం జరుగుతోంది.
టీసీఎస్ సహకారంతో 2019 మే నెలలో మొదలుపెట్టిన ఆన్ లైన్ శ్రీవాణి టికెట్ విధానాన్నే కొనసాగించడం జరుగుతోంది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆఫ్ లైన్ ద్వారా తిరుమలలో ఏరోజుకారోజు జారీ చేసే విధానాన్ని మార్పు చేయడం జరిగింది. మార్పు చేసిన ఈ విధానంలో ముందు ఎవరైతే సాప్ట్ వేర్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తారో వారికే టికెట్ వచ్చే విధంగా సాఫ్ట్ వేర్ తయారు చేయడమైనది. రోజుకి వేల సంఖ్యలో టికెట్లు పొందుట కొరకు భక్తులు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల మొదటి ఒకటిన్నర నిమిషంలోపే ముందు వచ్చిన వారికి ముందు ఇచ్చే విధానంలో లాక్ చేయడం జరుగుతోంది. తదుపరి పేమెంట్ గేట్ వే లో విజయవంతంగా డబ్బులు చెల్లించినవారికి టికెట్లు జారీ చేయడం జరుగుతోంది. ఏదైనా కారణం వల్ల డబ్బులు చెల్లింపులు జరగని ఎడల అట్టి టికెట్లను తిరిగి పూల్లోకి తీసుకురావడం జరుగుతోంది. ఈ ప్రకియ ఐఆర్సీటీసీ మరియు ప్రభుత్వ ఇతర అడ్వాన్స్ బుకింగ్ సర్వీసుల్లో ప్రవేశపెట్టబడి ఉన్నది. ఈ విధానంలో మానవ ప్రమేయం పూర్తిగా తీసివేయడం జరిగింది. సిస్టమ్ ఆటోమేటిక్ గా పని చేయడం జరుగుతుంది.
పది నిమిషాల తర్వాత టకెట్లు జారీ చేయడం వాస్తవమే. ఎందుకంటే పేమెంట్ గేట్ వే వద్ద చెల్లింపు సమయంలో సాంకేతిక లోపం లేదా ఇతర కారణాల చేత టీటీడీకి డబ్బు జమ అయినట్లు మెసేజ్ రాకుంటే అలాంటి టికెట్లను తిరిగి పూల్ లోకి తీసుకొచ్చి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేయబడంది.
జీఎం ఐటీగా కనీస అర్హతలు లేని వ్యక్తిని నియమించారని చెప్పడం వాస్తవ విరుద్ధం. వారికి ఎం.టెక్ (కంప్యూటర్ సైన్స్) మరియు ఎం.ఎస్ (ఇన్నర్మేషన్ సిస్టమ్స్) అర్హతతో పాటుగా 32 సంవత్సరాలుగా ఐటీలో సుదీర్ఘ అనుభవం ఉండటంతో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద వారిని జీఎం ఐటీ ఎఫ్ఏసీగా మాత్రమే నియమించడం జరిగింది.
ఇక సాఫ్ట్వేర్ కు సంబంధించి టీసీఎస్ కొత్తగా సాప్ట్ వేర్ తీసుకురాలేదు. 2019 లో తీసుకొచ్చిన సాప్ట్ వేర్ నే వినియోగంలో ఉంచి ఎప్పటికప్పుడు భక్తుల నుండి వచ్చే సలహాలు, సూచనల మేరకు కాలానుగుణంగా టీసీఎస్ ద్వారా సాప్ట్ వేర్ ను మార్పు చేయడం జరుగుతోంది.
భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఆటో ఫిల్లింగ్, కాపీ,పేస్ట్ ప్రక్రియ విధానాలను పూర్తిగా రద్దు చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది. తర్వాత టీటీడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ ఆడిట్ లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించడం జరుగుతోంది.
ఈరోజు ప్రెస్ మీట్ లో టీటీడీ మాజీ చైAర్మన్ ప్రదర్శించిన శ్రీవాణి టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తి అవగాహనతో చేసినట్లు అనిపించలేదు. వారు టికెట్ బుక్ చేసుకునే సమయంలో పేమెంట్ గేట్ వే వరకు వెళ్లడం జరిగింది. దీనిని వారు సాంకేతిక లోపం అని తెలిపి ఉన్నారు. కానీ వారి అకౌంట్లో సరిపడ నగదు లేనందు వల్ల పేమెంట్ గేట్ వే దగ్గర వారి ట్రాన్సాక్షన్ రిజెక్ట్ చేయబడింది. అటు పిమ్మట వారు తిరిగి ప్రయత్నించడం వల్ల అది సాంకేతికంగా కొత్త ప్రయత్నం కింద లెక్కింపబడుతుంది. అప్పటికే వారి ముందున్న వారిని సిస్టమ్ పరిగణలోకి తీసుకుంటుంది. దీనితో వీరు వెయిటింగ్ లిస్టులో వెనుకబడి ఉన్నారు. ఈ అంశాలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది.
No comments :
Write comments