4.5.26

శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాల వైభవం vasantotsavam




శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 0నుండి 09 తేదీ వరకు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుగనున్నాయి.


 ఉత్సవాల్లో భాగంగా మే 08 సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల రకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణ రథంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిస్తారు మహోత్సవం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించనుంది.


ప్రతి రోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల రకు స్నపన తిరుమంజనంఅనంతరం సాయంత్రం ఊంజల్ సేవవీధి ఉత్సవాలు నిర్వహిస్తారుతొలి రెండు రోజుల పాటు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవాలలో పాల్గొనడం విశేషం.


చివరి రోజు శ్రీదేవిభూదేవి సమే శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారితో పాటు శ్రీరామచంద్ర మూర్తిసీతలక్ష్మణఆంజనేయస్వామిఅలాగే శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపుగా తీసుకువచ్చి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనంఆస్థానం నిర్వహిస్తారు.


వసంత ఋతువులో లభించే పుష్పాలుఫలాలతో స్వామివారిని ఆరాధించడం ద్వారా భక్తులు దివ్యానుగ్రహాన్ని పొందడమే  వసంతోత్సవాల అంతరార్థమని అర్చకులు తెలిపారు.


 సందర్భంగా మే 07 నుండి 09 తేదీ వరకు ఆలయంలో నిత్య కల్యాణోత్సవం ఆర్జిత సేవనుఅలాగే మే 07 తిరుప్పావడ సేవను టీటీడీ రద్దు చేసింది.

No comments :
Write comments