VIDEO
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీనారా యణస్వామి వారి ఆలయంలో జూన్ 16 నుం డి 25 వ తేదీ వరకు శ్రీ పెరియాళ్ వార్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు .
ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో శ్రీశ్రీశ్ రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి తమ శిష్ యబృందంతో కలిసి శ్రీ పెరియాళ్వా ర్వారి సన్నిధిలో దివ్య ప్రబంధ పాశురాలను నివేదించనున్నారు. పా శురాల గానామృతంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగనుంది.
జూన్ 25 న తిరుమంజనం, గరుడ– గజ వా హనాలపై దివ్య విహారం
ఉత్సవాల చివరి రోజైన జూన్ 25 న ఉ దయం శ్రీ పెరియాళ్వార్కు తిరు మంజనం నిర్వహించనున్నారు. అనం తరం సాయంత్రం శ్రీ గోవిందరాజస్ వామివారు గరుడవాహనంపై, శ్రీ పె రియాళ్వార్ గజవాహనంపై ఆలయ నాలు గు మాడవీధుల్లో విహరించి భక్తు లకు దివ్య మంగళ దర్శనం ప్రసాదిం చనున్నారు.
శ్రీమన్నారాయణుని పరమభక్తుడు శ్ రీ పెరియాళ్వార్
శ్రీ పెరియాళ్వార్ శ్రీమహావిష్ ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడైన పరమభక్తుడు. భక్తి సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని పొందిన ఆయన, శ్రీ ఆండాళ్ అమ్మవారికి తండ్రి . ప్రతిరోజూ తులసీమాలలను తయారు చేసి స్వామివారికి సమర్పిస్తూ భ గవత్సేవలో జీవితాన్ని అంకితం చే శారు. ఆయన సాన్నిధ్యంలో పెరిగిన ఆండాళ్ అమ్మవారు శ్రీమన్నారా యణునినే తన భర్తగా భావించి భక్ తి మార్గంలో ఆదర్శంగా నిలిచారు.
దివ్య ప్రబంధాలలో ఎన్నో అమూల్ యమైన పాశురాలను రచించిన శ్రీ పె రియాళ్వార్కు శ్రీమహావిష్ణువు సాక్షాత్కారం కలిగిన మహాభాగవతు డిగా వైష్ణవ సంప్రదాయం కీర్తిస్ తుంది.
No comments :
Write comments