5.6.26

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం donation




ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు గురువారం విరాళంగా అందింది. హైద‌రాబాద్‌కు చెందిన దాతలు శ్రీ సంజ‌య్ బాబు రూ.10 లక్షలు, హోమిపెట్స్ అధినేత శ్రీ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ బాబు రూ.10 లక్షలు చొప్పున విరాళంగా అందించారు.


ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమలలోని టిటిడి ఛైర్మ‌న్ క్యాంప్ కార్యాల‌యంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు అందజేశారు.


ఈ సందర్భంగా దాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. 


ఈ కార్యక్ర‌మంలో టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ న‌న్న‌ప‌నేని స‌దాశివ‌రావు పాల్గొన్నారు.  


No comments :
Write comments