ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు గురువారం విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన దాతలు శ్రీ సంజయ్ బాబు రూ.10 లక్షలు, హోమిపెట్స్ అధినేత శ్రీ హర్షవర్థన్ బాబు రూ.10 లక్షలు చొప్పున విరాళంగా అందించారు.
ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు అందజేశారు.
ఈ సందర్భంగా దాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.
No comments :
Write comments