జూన్ 22న ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం, అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సుగంధభరితమైన వివిధ రకాల పుష్పాలు, పవిత్ర పత్రాలతో శ్రీ గోవిందరాజస్వామివారికి విశేష అభిషేకం, అర్చనలు నిర్వహించనున్నారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వామివారి వీధి ఉత్సవం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది.
పుష్పయాగ సేవలో పాల్గొనదలచిన గృహస్తులు (ఇద్దరు) రూ.516/- టికెట్ను కొనుగోలు చేసి ఈ దివ్యసేవలో భాగస్వాములు కావచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
కాగా, ఈ ఏడాది మే 23 నుండి 31 వరకు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాలలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, సిబ్బంది, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు వివరించారు.
ఈ దివ్య పుష్పయాగ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని టీటీడీ కోరుతోంది.
No comments :
Write comments