1.6.25

Devotees Sentiments Must Be Respected - TTD Addl Eo









TTD Additional Executive Officer Sri Ch Venkaiah Chowdary emphasized that TTD staff, Srivari Sevaks are working tirelessly day and night to provide the best services to the visiting devotees. 


He urged that no one should speak or act in ways that hurt devotees' sentiments.

Following the peak summer rush, the Additional EO inspected queue lines near Shila Toranam on Saturday, and interacted with devotees. The devotees also expressed satisfaction with the arrangements.

He referred to an incident where a devotee protested about food services, but later apologized, admitting he was unwell, and out of frustation he raised anti slogans against TTD. But later realized his mistake after seeing the impeccable services of TTD to devotees in serving Annaprasadam, milk on time in waiting lines to devotees with Srivari Sevaks.

Additional EO warned that unauthorized individuals provoking devotees and recording videos will face legal action.

He requested devotees to be cooperative, use the facilities provided, and have a smooth darshan experience with patience as Tirumala is witnessing pilgrim surge for the last ten days.

Deputy EO Health Sri Somannarayana, Health Officer Dr. Madhusudan, VGO Sri Surendra, and other officials were present.

భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడ‌టం స‌రికాదు - TTD Addl Eo

శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తుల కోసం టీటీడీ సిబ్బంది అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడ‌టం స‌రికాద‌ని టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి అన్నారు.

వేస‌వి సెల‌వుల కార‌ణంగా తిరుమ‌ల‌లో అధిక ర‌ద్దీ నెల‌కొన‌డంతో శిలాతోర‌ణం దగ్గర మొదలవుతున్న ద‌ర్శ‌న క్యూలైన్ల‌ను ఆయ‌న శ‌నివారం ప‌రిశీలించారు.
భ‌క్తుల‌కు పంపిణీ చేస్తున్న అన్న‌, పానీయాలు గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసు













కున్నారు. భ‌క్తులంద‌రూ టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాల‌పై అద‌న‌పు ఈవో వ‌ద్ద సంతృప్తి వ్య‌క్తం చేశారు.
ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నిన్న ఓ వ్య‌క్తి ద‌ర్శ‌న క్యూలైన్ లో అన్న ప్ర‌సాదాలు అంద‌లేద‌ని నినాదాలు చేసిన విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. ఆయ‌నను వెంట‌నే సంప్ర‌దించి ఆరా తీయ‌గా త‌న‌కు ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ర‌ద్దీ గురించి అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో ద‌ర్శ‌న స‌మ‌యం ఆల‌స్య‌మ‌వుతున్నదని తాను అసహనంతో నినాదాలు చేసిన‌ట్లు ఒప్పుకున్నారు.
అయితే క్యూలైన్ లో అన్న ప్ర‌సాదాలు, పాలు అందిస్తున్నది గమనించి త‌న త‌ప్పును గ్ర‌హించి మాన‌సిక క్షోభ‌కు గురై, పశ్చాత్తాపంతో తన ప్రవర్తనను క్షమించమని కోరిన‌ట్లు కూడా ఆ భ‌క్తుడి తెలియ‌జేశాడ‌ని చెప్పారు.
టీటీడీ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు క్యూలైన్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ భక్తుల‌కు అందిస్తున్న స‌దుపాయాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని చెప్పారు. వేస‌వి సెల‌వుల నేప‌థ్యంలో ప్ర‌తిరోజూ ఒక ల‌క్ష‌కు పైగా భ‌క్తులు స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నార‌ని, వారాంతాల్లో ఈ సంఖ్య 1.20 ల‌క్ష‌లు దాటుతోంద‌ని చెప్పారు. వీఐపీ బ్రేక్‌, శ్రీ‌వాణి ద‌ర్శ‌నాల‌ను త‌గ్గించి సాధార‌ణ భ‌క్తుల‌కే ద‌ర్శ‌నాల్లో పెద్ద‌పీట వేస్తున్నామ‌న్నారు. ప్ర‌తిరోజూ 60శాతానికి పైగా స‌ర్వ ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులే స్వామివారిని ద‌ర్శించుకుంటున్నార‌ని చెప్పారు.
సాధార‌ణ రోజుల‌కంటే 10 వేల మందికి భ‌క్తుల‌కు అద‌నంగా ద‌ర్శ‌న‌మ‌య్యేందుకు టీటీడీ సిబ్బంది రాత్రింబ‌వ‌ళ్లు నిద్ర లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని తెలియ‌జేశారు. క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా నిరంత‌రాయంగా అన్న ప్ర‌సాదాలు, టీ, కాఫీ, పాలు, మ‌జ్జిగ‌, స్నాక్స్ పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. ఆరోగ్య విభాగం ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త‌ను తొల‌గిస్తూ భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం త‌లెత్త‌కుండా పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌ని తెలిపారు.
టీటీడీ సిబ్బంది కృషిని ప‌ట్టించుకోకుండా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా కొంద‌రు ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని ఆయ‌న తెలిపారు. కొంద‌రు అన‌ధికారిక వ్య‌క్తులు ద‌ర్శ‌న క్యూలైన్ల‌లో భ‌క్తుల‌ను రెచ్చ‌గొడుతూ వీడియోలు చిత్రీక‌రిస్తున్నార‌ని, అలాంటివారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.
విప‌రీత ర‌ద్దీ నేప‌థ్యంలో భ‌క్తులు టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాల‌ను వినియోగించుకుని సంయ‌మ‌నం పాటిస్తూ స్వామివారిని ద‌ర్శించుకోవాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో శ్రీ సోమ‌న్నారాయ‌ణ‌, హెల్త్ ఆఫీస‌ర్ శ్రీ మ‌ధుసూద‌న్‌, వీజీఓ శ్రీ సురేంద్ర‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

జూన్1న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం




శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో జూన్ 1వ తేదిన ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వ‌హించ‌నున్నారు.

 
ఇందులో భాగంగా  ఉదయం శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేస్తారు.  
       
శ్రీ‌వారి మూల‌మూర్తికి ముందు గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో కౌతుకమూర్తి అయిన‌ శ్రీ మనవాళపెరుమాళ్(శ్రీ భోగ శ్రీనివాసమూర్తి)ను, ఆయన కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆశీనులు చేస్తారు. త‌ర్వాత‌ శ్రీ‌వారి మూల‌మూర్తిని శ్రీ  భోగ శ్రీ‌నివాస‌మూర్తికి క‌లుపుతూ దారం క‌ట్టి అనుసంధానం చేస్తారు.
   
అనంత‌రం వేద పండితులు వేద పారాయ‌ణం చేయ‌గా, అర్చకస్వాములు  ప్ర‌త్యేక సహస్ర కలశాభిషేకాన్ని వైభ‌వంగా నిర్వహించనున్నారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించనున్నారు.

Special Sahasra Kalashabhishekam for Sri Bhoga Srinivasa Murthy on 1st June




Following the consecration of Sri Bhoga Srinivasa Murthy one of the Pancha Berams of Sri Venkateswara at the Tirumala temple, a special Sahasra Kalashabhishekam will be performed on June 1.

As part of this in the morning, at the Garudalwar Sannidhi, the deities Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi, Sri Bhoga Srinivasa Murthy, Sri Viswaksena Swamy will be seated on a special platform.
Facing the main deity in the sanctum sanctorum, Sri Bhoga Srinivasa Murthy, who is also known as the Kautuka Murthy, will be seated at Garudalwar Sannidhi, and Sahasra Kalashabhishekam will be rendered in a grand manner in Ekantam.
All Arjita Sevas at the temple will be conducted as per regular schedule.

జూన్ 1న స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ




ప్రతి నెలా మొదటి మంగళవారం (జూన్ 3వ తేది) స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా జూన్ 1వ తేది ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. 

 ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. 
 ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది. 

Local Darshan on 01st June




As part of the monthly darshan being allotted to local residents on the first Tuesday of every month, TTD will issue darshan tokens on Sunday, June 1, for the upcoming darshan scheduled on June 3. 

Tokens will be distributed on a first-come, first-serve basis starting from 5 AM. 
For Tirupati locals, tokens will be issued at the Mahati Auditorium counters while for Tirumala locals, tokens will be issued at the Balaji Nagar Community Hall. 
Residents from the mandals of Tirupati Urban, Tirupati Rural, Chandragiri, and Renigunta are requested to bring their Aadhaar card to collect the tokens. 
Local devotees are requested to make note of this.. 

జూన్ 2 నుండి ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌లో ప్రవేశాల‌కు దరఖాస్తుల ఆహ్వానం SV DANCE & NADASWARAM SCHOOL




తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో 2025-26వ విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి జూన్ 02వ తేదీ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.


కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి, నృత్యం, హరికథ, మృదంగం, ఘటం విభాగాల్లో ఫుల్‌టైమ్, విశార‌ద‌(డిప్లొమా), ప్ర‌వీణ‌(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్‌టైమ్ స‌ర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి.

 జూన్ 27వ తేదీ నుండి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. ఇత‌ర ప్రాంతాల విద్యార్థుల‌కు హాస్ట‌ల్ వ‌స‌తి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో ఈవో, టిటిడి పేరుతో రూ.50/- డిడి తీసి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్‌ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కోర్సులకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 9440793205, 9848374408 నంబర్లలో సంప్రదించగలరు.