7.6.25

వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి గరుడసేవ









తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. రాత్రి 7.00 గంటల నుండి 10.00 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. జ్ఞాన, వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన, వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠుతుడైన గరుడుని దర్శించి అభీష్ఠసిద్ధి పొందుతారు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ బాలాజీ, డిప్యూటీ ఈవోలు శ్రీ ఎం.లోకనాథం, ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, పలువురు అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. 

Garuda Gamana Garuda Dhwaja

The Garuda Vahana Seva of Sri Govindaraja Swamy in Tirupati was held amidst rhythmic Vedic chants, colourful display of various artforms by reputed artistes and a huge gathering of devotees on the pleasant Friday.























The procession moved majestically along the temple streets in a swift manner led by paraphernalia amidst gentle rain droplets.

Braving inclement weather, a large number of devotees gathered to witness Sri Govindaraja Swamy on Garuda chanting Govinda, Govinda with utmost devotion.

Both the senior and junior pontiffs of Tirumala, JEO Sri Veerabrahmam, FACAO

Mohini Mesmerizes









The divine universal damsel, Jagan Mohini mesmerized the devotees on the fifth morning of the ongoing annual Brahmotsavams at Sri Govindaraja Swamy temple in Tirupati.


On the Friday, the Utsava deity of Sri Govindaraja Swamy decked in colourful silks and dazzling jewels glittered on the palanquin.

Later Snapanam will be performed to the utsava deities.

DyEO Smt Shanti, other temple staff, and devotees were present.

SPECIAL VASTRAMS

As part of the Sri Govindaraja Swamy Brahmotsavam, on Friday evening between 4 and 5 pm, a procession of new clothes and Thiruvadi will be taken to the Sri Govindaraja Swamy temple from Komalamma Satram via Bazaar Street, Gandhi Road, four Mada Streets, and Sannidhi Street. 

At 6 pm, the ornament presented from Tirumala Sri Venkateswara Swamy will be taken to the Sri Govindaraja Swamy temple from Sri Eduru Anjaneya Swamy temple. 

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి






తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం ఉదయం గోవిందరాజస్వామివారు పల్లకీపై మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు.

భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్‌, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. అందులో హేయమైన విషంతోపాటు ఉపాదేయమైన అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. వివిధ దేవతలు వాటిని స్వీకరించారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరించాడు. అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవశులైపోయారు. తత్ఫలితంగా వారు వంచింపబడడం, దేవతలు అనుగ్రహింపబడడం జరిగింది.
అనంతరం ఉదయం 10 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, పలువురు ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. 

6.6.25

సర్వభూపాల వాహనంపై శ్రీ గోవిందుడు







తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి స్వామి వారు  సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు.


రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సర్వభూపాల వాహ‌నం – య‌శోప్రాప్తి :

సర్వభూపాల అంటే రాజులందరు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు.

వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ.బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. 

Sri Govinda Takes Ride on Sarvabhoopala Vahanam















Sri Govindaraja Swamy took out a celestial ride on the Sarva Bhupala Vahanam in Tirupati on Thursday evening.

Both the senior and junior pontiffs of Tirumala, DyEO Smt Shanti and other staff, devotees were present.