29.6.25

దేవుని కడప, ఒంటిమిట్ట ఆలయాలను పరిశీలించిన టిటిడి జేఈవో Devuni kadapa











కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం పరిశీలించారు.  కడప, ఒంటిమిట్ట ఆలయాల పరిధిలో శనివారం ఆయన వేరువేరుగా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు. త్వరలోజరుగనున్న బాలాలయం కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఆలయ గర్భాలయంలో, పోటు గదిలో వర్షం నీరు లీకేజీలు లేకుండా చూడాలని, విద్యుత్ పాత వైర్లు తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గర్భాలయంలో పైభాగాన ఉన్న కాలం చెల్లిన కొయ్య దంతెలను తొలగించే అంశం, ఆలయంలో అవసరమైన గ్రానైట్ పనులు, 
పోటు పెంపు, పీఏసీ వద్ద లిఫ్ట్ ఏర్పాటు, ఆలయం చుట్టూ రోడ్ల విస్తరణ, విలువైన వస్తువులు భద్రపరుచుకునేందుకు స్ట్రాంగ్ రూం ఏర్పాటు, భక్తులకు సౌకర్యవంతంగా పార్కింగ్,  నూతన వాహన మండపం, తదితర మరమ్మతుల పనులపై నివేదిక తయారు చేయాలని అధికారులను కోరారు.
పుష్కరిణి వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పోరేషన్ అధికారులకు సూచించారు. 
 అనంతరం ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వారి ఆలయం పరిసరాలలో జరుగుతున్న పనులపై జేఈవో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరింతగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్యాణ వేదిక వద్ద భక్తులకు కనిపించేలా శంఖు చక్రాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఆలయం సమీపంలో 27 నక్షత్రాలు చెట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఒంటిమిట్ట ఆలయ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో కడప మునిసిపల్ కమీషనర్ శ్రీ మనోజ్ రెడ్డి, ఎస్.ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వేంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి,  ఈఈలు శ్రీ నాగరాజు, శ్రీమతి సుమతి, పలువురు అధికారులు, ఆలయాల అర్చకులు, ఆలయ ఇన్ స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

జూలై నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు..... Sri Kodanda Rama Swamy Vari Temple

 




  •   జూలై 05, 12, 19, 26 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలోఊంజల్ సేవ జరుగనుంది.
  • జూలై 10వ  తేదీన పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర కలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తిరుచ్చిపై ఊరేగనున్నారు.
- జూలై 16న ఆణివార ఆస్థానం.
  • జూలై 20 - 22 వరకు పవిత్రోత్సవాలు, జూలై 19న అంకురార్పణ.
- జూలై 24న పునర్వసు నక్షత్రం మరియు అమావాస్య సందర్భంగా ఉ. 7.00 గం.లకు సహస్రకలశాభిషేకం, ఉదయం 11 గంటలకు  శ్రీ సీతారాముల కల్యాణం, రాత్రి 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.  

తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయంలో...

జూలై 06 - 09వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు

Dil Raju Dreams Grand Launch Event





























 

https://youtu.be/Jhj4yRD1Q3c

Green Sorrel Rice | చుక్క కూర రైస్

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి Sri Kalayana Venkateswa Swamy





 శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02 తేదీ వరకు మూడు రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్ధ‌మైంది. ఇందుకోసం ఆల‌యంలో ప్ర‌త్యేకంగా విద్యుత్, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు. వాహ‌న‌సేవ‌ల కోసం పెద్ద‌శేష‌, హ‌నుమంత‌, గ‌రుడ వాహ‌నాల‌ను సిద్ధం చేశారు. మొదటి రోజు 30వ తేదీ రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రెండో రోజు జూలై 01వ తేదీ హనుమంత వాహనంపై, మూడో రోజు జూలై 02వ తేదీ గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. జూలై 03న పార్వేట ఉత్సవం జూలై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జూన్ 30వ తేదీ నుండి జూలై 03వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవం, తిరుప్పావడ సేవ, జూలై 01వ తేదీ స్వర్ణపుష్పార్చన, జూలై 02వ తేదీ అష్టోత్తర శతకలశాభిషేకం సేవలను రద్దు చేశారు.

Three Day Sakshatkara Vaibhavotsavams in SKVST








The Sakshatkara Vaibhavotsavams of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram will be held from June 30 to July 2.


On July 3, Parvetotsavam will be conducted from 7 AM to 2 PM.

Due to these festivities, certain daily sevas stands cancelled. 

From June 30 to July 3, Nitya Kalyanotsavam and Tiruppavada Seva are cancelled. On July 1, Swarnapushparchana will not be performed, and on July 2, Ashtottara Shata Kalasha Abhishekam stands cancelled.

28.6.25

Special Festivals in July at Tirupati Sri Kodandarama Swamy Vari Temple




On July 5, 12, 19, and 26 (Saturdays), Abhishekam to the Moola Murty of Sri Sita, Rama, and Lakshmana will be performed at 6 AM. 


At 5 PM, the Utsava Murthis of Sri Rama and Sita Devi will be taken on a procession along the four Mada Streets, followed by Unjal Seva in the temple.

On July 10 (Pournami), Astottara Kalasa Abhishekam will be held at 8.30 AM. 

In the evening at 5.30 PM, Sri Kodandarama Swamy, along with Sita and Lakshmana, will be taken on a Tiruchi Procession.

On July 16, the temple will observe Anivara Asthanam.

Pavitrotsavams will be held from July 20 to 22, with Ankurarpanam on July 19.

On July 24, which coincides with Punarvasu Nakshatram and Amavasya.

Sahasra Kalasha Abhishekam will be performed at 7 AM

Sri Sita-Rama Kalyanam at 11 AM

In the night at 7 PM, Sri Rama will bless devotees on the Hanumantha Vahanam.

At Kapileswara Swamy Temple, Tirupati:

Annual Pavitrotsavams will be conducted from July 6 to 9.