హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం hindu dharma prachara parishat
టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
• వచ్చే వేసవిలో తెలుగు రాష్ట్రాలలో 8,9,10 తరగతి విద్యార్థులకు ''సద్గమయ'' అను కార్యక్రమం ద్వారా నైతిక విలువలు, మానవీయ ధర్మాలు, వ్యక్తిత్వ నిర్మాణానికై శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయం.
• తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనకు రిజిస్టర్ అయిన 7856 భజన బృందాలు నైపుణ్యాన్ని పరిశీలించి జిల్లాస్థాయిలో భజన ప్రదర్శనలను ఏర్పాటు చేసి వాటిని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీమతి జానకిదేవి, శ్రీ మహేందర్ రెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు.
స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
అంతకుముందు టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది.
ఈ సమావేశంలో 236 స్టాఫ్ నర్సులు, 20 పారా మెడికల్ సిబ్బంది, 48 అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించడం జరిగింది.
ఈ సమావేశంలో బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ సదాశివరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్, తదితరులు పాల్గొన్నారు.

.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)











