2.5.26

ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం ponnakalva utsavam



చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్ ఉత్సవం శుక్రవారం వైభవంగా జరిగిందిఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారుఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామిశ్రీ కృష్ణస్వామిశ్రీ ఆండాళ్ అమ్మవారుసేనాధిపతి వారు వేర్వేరు  తిరుచ్చిలపై ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులోని పొన్నకాల్వ మండపానికి చేరుకున్నారు.


అక్కడ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు సందర్భంగా పాలుపెరుగుతేనెపసుపుచందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు తరువాత  అలంకరణసేవాకాలంసాత్తుమొర చేపట్టారుసాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు పొన్నకాల్వ మండపంలో ఊంజల్ సేవ నిర్వహిస్తారు.


సాయంత్రం 5.30 గంటలకు అక్కడినుండి బయలుదేరి తిరుచానూరు సన్నిధి వీధిగుండా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందుకు చేరుకునే సమయంలో అక్కడ మహద్వారం యొక్క ఒక లుపును మూస్తారు (శ్రీ పద్మావతి అమ్మవారు తన బావగారైన శ్రీ గోవిందరాజస్వామివారిని మూసిన తలుపుచాటు నుంచి చూస్తుంది అని ఐతిహ్యం). తరువాత తిరుచానూరు నుంచి ఊరేగింపుగా శ్రీ  గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వి.ఆర్.శాంతిఏఈవో శ్రీ నారాయణ చౌద‌రిసూపరింటెండెంట్లు శ్రీ చిరంజీవిశ్రీ శేషగిరిటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధ‌నంజ‌య‌ఇతర అధికారులుఆల అర్చకులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ధ్వజారోహణ మహోత్సవంతో వైభవంగా ఆరంభమైన శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు brahmotsavams





నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణ మహోత్సవంతో వార్షి బ్రహ్మోత్సవాలు భక్తి పారవశ్యంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.


 వేదపండితుల మంత్రోచ్ఛారణలుమంగళవాయిద్యాల నినాదాలుభక్తుల గోవింద నామస్మరణల మధ్య  పవిత్ర కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.


ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు ఉత్సవం ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు పర్యవేక్షిస్తారని ఆధ్యాత్మి విశ్వాసం.


అనంతరం ఉదయం 5.30 నుండి 6.30 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ట్టం వైఖానస ఆగమ విధానంలో ఘనంగా నిర్వహించారుగరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై ఆవిష్కరించిపూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారుదీని ద్వారా 18 గణాలు, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు భావిస్తారు.


తదుపరి ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామిఅమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగిందిపాలుపెరుగుతేనెపసుపుచందనంకొబ్బరినీళ్లతో అభిషేకం నిర్వహించి భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తారు.


సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్ సేవరాత్రి 7.30 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనసే జరుగనున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులు, శ్రీ చంగల్ రాయులుఅర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.

1.5.26

శాస్త్రోక్తంగా శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ankurarpanam at nagalapuram temple



నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం భక్తి వైభవంతో ఘనంగా నిర్వహించారువేదఘోషల మధ్య నిర్వహించిన  పవిత్ర కార్యక్రమం ఆలయాన్ని ఆధ్యాత్మిక కాంతులతో అలంకరించింది సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపితోమలసేవఅర్చన వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించారుఅనంతరం సాయంత్రం మృత్సగ్రహణంసేనాధిపతి ఉత్సవం జరిపిబ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా చేపట్టారు.


ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం


మే 1 ఉదయం మేష లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయిఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం, 5.30 నుండి 6.30 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించనున్నారుప్రతిరోజూ ఉదయంరాత్రి వాహన సేవలుస్నపన తిరుమంజనంఊంజల్ సేవలు నిర్వహించి భక్తులకు దివ్యానుభూతిని కలిగించనున్నారు.


బ్రహ్మోత్సవాల ప్రధాన కార్యక్రమాలు


 01-05-2026

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – పెద్దశేష వాహనం

 02-05-2026

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

 03-05-2026

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

 04-05-2026

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

 05-05-2026

ఉదయం – మోహినీ అవతారం

రాత్రి – గరుడ వాహనం

 06-05-2026

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

 07-05-2026

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

 08-05-2026

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – ఆర్జిత కల్యాణోత్సవం

రాత్రి – అశ్వవాహనం

 09-05-2026

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం


 భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు – ఆధ్యాత్మిక కళోత్సవాల సందడి


బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు దివ్యశోభతో కళకళలాడుతున్నాయిచలువ పందిళ్లురంగవల్లులతో దేవాలయం మరింత సౌందర్యవంతంగా తీర్చిదిద్దారుభక్తుల సౌకర్యార్థం అన్నదానంతాగునీరువైద్య సేవలు సహా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టుదాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలుభజనలుసంగీతసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు భక్తి కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక నందసంద్రంలో ముంచెత్తనున్నాయి.


 కార్యక్రమంలో టీటీడీ అధికారులుప్రధాన అర్చకులు శ్రీ నాగరా భట్టాచార్యులుటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుచెంగల్ రాయులుఅర్చకులుభక్తులు పాల్గొన్నారు.


Ankurarapanam for Sri Venakteswara Swamy Vari Temple Brahmotsavams at New Delhi



Ankurarpanam for the annual Brahmotsavams of Sri Venkateswara Swamy Temple, New Delhi, was performed on Thursday evening as per tradition.


All arrangements are in place for the Brahmotsavams, which will commence with Dwajarohanam on May 1. Daily Vahana Sevas and rituals will be conducted.


Devotees are invited to participate and seek the blessings of the Lord.

Ankurarpanam for Narapura Venkateswara Swmay Vari Brahmotsavams


Ankurarpanam for the annual Brahmotsavams of Sri Narapura Venkateswara Swamy Temple, Jammalamadugu, was performed on Thursday evening as per tradition.


The Brahmotsavams will begin with Dwajarohanam on May 1. The temple has been beautifully decorated and arrangements are in place for devotees.


Officials and priests participated in the rituals.

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్ర క్తంగా అంకురార్పణ - మే 1న ధ్వజారోహణం jammalamadugu temple



జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ రిగిందిఅంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపికొలువుపంచాంగ శ్రవణం నిర్వహించారు.


సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనంమృత్సంగ్రహణంసేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.


  కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.


శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారుభక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలువిద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.


మే 1 ధ్వజారోహణం :


మే 1 తేదీ శుక్ర‌వారం ఉదయం 9. 30 నుంచి 10.15 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

Patra Pushpa Yagam at Sri Kapileswara Swamy Vari Temple







The Patra Pushpa Yagam was performed with grandeur at Sri Kapileswara Swamy Temple on Friday, offering a divine experience to devotees.


Special rituals including Abhishekam and Snapana Tirumanjanam were conducted, followed by the Yagam using various flowers and sacred leaves. About 3 tonnes of flowers were donated by devotees from different states.


Temple officials, priests, and a large number of devotees participated.