24.6.25

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళం Donations






టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు సోమవారం పలువురు భక్తులు విరాళం అందించారు.


బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ ఫర్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ  ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు అందించింది. సంస్థ తరపున శ్రీ రాఘవేంద్ర అన్నమయ్య భవనంలో అదనపు ఈఓకు డీడీను అందజేశారు.

రాజస్థాన్‌కు చెందిన ఏకే ఇంజినీరింగ్ కంపెనీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10,59,000 విరాళంగా అందించింది.

కాగా రెండు రోజుల క్రిందట కొనసీమ జిల్లాకి చెందిన శ్రీ దండుమేను శశాంక్ కృష్ణ  రూ.10,00,006 విరాళంగా అందించారు.

ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు.

No comments :
Write comments