1.7.25

జూలై 02 శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం జూలై 1న అంకురార్పణ Pushpa yagam




తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 02న పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం జూలై 01వ తేదీ సాయంత్రం 5.30 - 8.30 గం.ల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.

జూలై 02వ ఉదయం 09.30 - 11.30 గం.ల వరకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 01 - 04 గం.ల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు.
జూన్ 02 నుంచి 10 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి ఈ యాగంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు.
వార్షిక పుష్పయాగం సందర్భంగా జూలై 01, 02 తేదీల్లో ఊంజల్ సేవను రద్దు చేశారు. 

No comments :
Write comments